గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020/21 సీజన్ ఫస్ట్ లెగ్ సెకండ్ సెమీస్ కూడా ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం రాత్రి జీఎంసీ స్టేడియం వేదికగా ఏటీకే మోహన్ బగాన్, నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ చివరకు 1-1 తేడాతో డ్రా అయింది. మ్యాచ్ మొత్తంలో మోహన్బగాన్ ఆటగాడు డేవిడ్ విలియమ్స్(32వ నిమిషంలో), నార్త్ఈస్ట్ యునైటెడ్ ప్లేయర్ ఇడ్రిస్సా సిల్లా(90+4వ నిమిషంలో)లు మాత్రమే ఒక్కో గోల్ చేశారు.
ఫలితంగా మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం రెండో లెగ్లోని మరో సెమీస్ వరకూ ఎదురుచూడాల్సిందే. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు రాయ్ కృష్ణ, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గుర్జీందర్ కుమార్కు లభించింది.
గేమ్ ప్రారంభమైనప్పటి నుంచే మోహన్ బగాన్ దూకుడు కనబర్చించింది. ఈ క్రమంలో ఆట 32వ నిమిషంలో సహచరుడు అందించిన పాస్ను డేవిడ్ విలియమ్స్ సూపర్ గోల్గా మలిచి మోహన్ బగాన్ ఖాతా తెరిచాడు. అనంతరం ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ రాకపోవడంతో 1-0తో ఫస్టాఫ్ ముగిసింది. సెకండాఫ్లో కూడా ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.
ఇరు జట్ల డిఫెన్స్ విభాగం మైదానంలో సమర్ధవంతంగా కదిలాయి. ఇక ఇంజ్యూరీ టైమ్ (90+4 నిమిషం)లో ఇడ్రిస్సా సిల్లా సూపర్ గోల్తో నార్త్ఈస్ట్ యునైటెడ్ టైటిల్ ఆశలను నిలబెట్టాడు. ఓటమి నుంచి తప్పించి డ్రాతో గట్టెక్కించాడు.