మార్గో: బంతిపై ఆద్యాంతం పట్టు సాధించిన ఏటీకే మోహన్ బగాన్.. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్ ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెకండ్ లెగ్ సెమీఫైనల్లో మోహన్ బగాన్ 2-1తో నార్త్ఈస్ట్ యునైటెడ్పై గెలిచింది. నార్త్ఈస్ట్తో ఫస్ట్ లెగ్ సెమీస్కు 1-1తో డ్రా చేసుకున్న మెహపక బగాన్ తాజా ఫలితంతో 3-2 గోల్స్ తేడాతో ఫైనల్ బెర్త్ సాధించింది. మోహన్ బగాన్ తరఫున డేవిడ్ విలియమ్స్(38వ నిమిషం), మన్వీర్ సింగ్(68వ నిమిషం) గోల్స్ చేశారు. వీపీ సుహేర్(74వ నిమిషం) నార్త్ఈస్ట్ తరఫున ఏకైక గోల్ చేశాడు.
ఫస్ట్ లెగ్ సెమీస్తో పోల్చితే డిఫరెంట్గా ఆడిన మోహన్ బగాన్, బాల్పై పూర్తి పట్టు సాధించింది. నార్త్ఈస్ట్ డిఫెన్స్ బాగున్నా.. ఫార్వార్డ్స్ గోల్స్ అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. కాగా, ఈ ఫలితంతో మోహన్ బగాన్.. ఏఎఫ్సీ కప్ గ్రూప్ స్టేజ్కు క్వాలిఫై అయ్యింది. ఇప్పటికే ఫైనల్ చేరిన ముంబై.. ఆసియా చాంపియన్స్ లీగ్ స్పాట్ను సంపాదించింది. రాయ్కృష్ణకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, మన్వీర్ సింగ్కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలోని టాప్ 2 జట్లే ఫైనల్స్కు చేరుకున్నాయి.