షాంఘై: కరోనా దెబ్బకు టోర్నీలన్నీ రద్దయ్యాయి అనుకుంటే.. ఇప్పుడు ప్లేయర్లు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే చైనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ వు లీకీ, స్కాట్లాండ్ మాజీ క్రికెటర్, పాక్ సంతతికి చెందిన మాజిద్ హక్కు కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా మరో ఫుట్బాలర్కు కూడా ఈ వైరస్ సోకిందిది.
బెల్జియం ప్రొఫెషనల్ ఫుట్బాలర్, మంచెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ మరౌనే ఫెల్లెయిని ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డాడు. ప్రస్తుతం చైనాలో ఉన్న అతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్గా వచ్చిందని జిహన్ ప్రోవిన్స్ వైద్యులు ప్రకటించారు.
చైనీస్ సూపర్ లీగ్ (సీఎస్ఎల్)లో భాగంగా షాన్డాంగ్కు ప్రాతినిధ్యం వహించేందుకు ఇక్కడికి వచ్చిన అతను శుక్రవారం ట్రైన్లో జినాన్ చేరుకోగా అక్కడి అధికారులు పరీక్షలు జరిపారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ 32 ఏళ్ల మరౌనే ఫెల్లెయినినే సీఎస్ఎల్ లీగ్లో కరోనా సోకిన తొలి ప్లేయర్. 2019లో షాన్డాంగ్ ఫ్రాంచైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్ 13 గోల్స్తో ఆ సీజన్లో అదరగొట్టాడు. దీంతో ఈ సీఎస్ఎల్ను నిర్వాహకులు రద్దు చేశారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఇటలీలోనైతే పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఇప్పటికే 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 47 వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. స్పెయిన్లో శనివారం ఒక్కరోజే 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇర భారత్లో కరోనా బాధితుల సంఖ్య 300కుపైగా చేరింది.