
మార్చి మధ్యలో వచ్చి..
చేతిలో ఉన్న వెయ్యి రూపాయలతో కాలం వెళ్లదీశాడు. కేరళ పాపులర్ సెవెన్ ఏ సైడ్ టోర్నీ కోసం 24 ఏళ్ల ముల్లర్.. మార్చి మధ్యలో భారత్కు వచ్చాడు. కానీ అప్పటికే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుండటంతో.. స్వదేశానికి వెళ్లేందుకు త్రిస్సూర్ నుంచి ముంబైకి రైల్లో బయలుదేరాడు. కానీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారని తెలిసింది.

పోలీసుల సాయంతో..
‘ఫ్లైట్స్ బంద్ కావడంతో అక్కడే నిద్రపోయా. ఓ పోలీసు వచ్చి లేపాడు. అక్కడి నుంచి వెళ్లాలని చెప్పాడు. కానీ నేను కేరళ తిరిగి వెళ్లలేను. అలాగని హోటల్లో ఉండలేను. ఎందుకంటే డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియలేదు. నాకు చావు తప్పదని భావించా. చివరకు ఎవరూ చూడని ఓ టెర్మినల్ దగ్గర చిన్న ప్లేస్లో ఉండిపోయా. పోలీసులు ఆ ప్లేస్ను అంత సులువుగా గుర్తించలేరు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు కనిపెట్టినా.. నా పరిస్థితిని చూసి సాయం చేశారు. అలా అక్కడే రెండున్నర నెలలు ఉన్నా. పోలీసులు ఇచ్చే ఫుడ్ తినడం, వాళ్ల మొబైల్స్లో హిందీ సినిమాలు చూస్తూ గడిపా. మా ఊరు విషయాలను వాళ్లకు చెప్పా' అని ముల్లర్ పేర్కొన్నాడు.

ఆదుకున్న మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే..
నిసర్గ తుపాన్ వచ్చినప్పుడు పోలీసులు తమ క్యాబిన్ను ఇచ్చి ఆదుకున్నారన్నాడు. అయితే రెండు రోజుల కిందట మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేకు ఈ విషయం తెలిసి ఆదుకున్నారని చెప్పాడు. హోటల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎంబసీతో మాట్లాడించారని అన్నాడు. వీలైనంత త్వరగా ఘనాకు వెళ్లే ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నానని ముల్లర్ వెల్లడించాడు.

చనిపోయానని అనుకున్నారు..
తన ఫోన్ చెడిపోవడంతో 20 రోజుల పాటు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదని ముల్లర్ చెప్పాడు. దీంతో తాను చనిపోయినట్లు భావించారన్నాడు. ‘పోలీసులే నాకు ఓ ఫోన్ ఇచ్చారు. నా కుటుంబానికి నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను చనిపోయానేమోనని అనుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు నేను భద్రంగా ఉన్నా. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. నా కోసం రోటీ, బిస్కట్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చేవారు. కాకపోతే బట్టల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒకే జతను వారం రోజులు వేసేవాడిని. తర్వాత ఎండలో ఆరబెట్టి, కొద్దిగా ఫెర్ఫ్యూమ్ కొట్టి మళ్లీ వేసుకునేవాడిని' అని ముల్లర్ వివరించాడు.


Click it and Unblock the Notifications


