హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో కొలంబియా విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పోలెండ్తో జరిగిన మ్యాచ్లో 0-3 తేడాతో కొలంబియా ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.
వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ క్రమంలో ఆట 40వ నిమిషంలో యోర్రి మైనా తొలి గోల్ నమోదు చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో కొలంబియా ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేశారు.
ఈ క్రమంలో 70వ నిమిషంలో రాడమెల్ ఫాల్కా మరో గోల్ చేయడంతో కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 75వ నిమిషంలో కుడ్రాడో మరో గోల్ చేయడంతో కొలంబియా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. వరల్డ్ కప్లో కుడ్రాడోకి ఇది రెండో గోల్ కావడం విశేషం.
.@Falcao gets his first #WorldCup goal for #COL. 🐯⚽
— FIFA World Cup 🏆 (@FIFAWorldCup) June 24, 2018
🎥 Highlights 👉 https://t.co/LOdKDX2Cwn
📺 TV listings 👉 https://t.co/xliHcxWvEO pic.twitter.com/k52X90N5gl
2014లో జరిగిన వరల్డ్ కప్లో జపాన్తో జరిగిన మ్యాచ్లో కుడ్రాడో తొలి గోల్ నమోదు చేశాడు. మ్యాచ్ మొత్తం పోలెండ్ ఆటగాళ్లు డిఫెన్స్కే పరిమితమయ్యారు. దీంతో మ్యాచ్ ముగిసేలోపు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. దీంతో కొలంబియా 3-0తో పోలెండ్పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో పోలెండ్ జట్టు 15 సార్లు తప్పిదాలు చేయగా, కొలంబియా జట్టు 10 సార్లు తప్పిదాలకు పాల్పడింది. కీలకమైన మ్యాచ్లో పోలాండ్ ఓడిపోవడంతో ఆ టీమ్ క్వార్టర్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో కొలంబియా 3-1 తేడా గోల్స్తో విక్టరీ నమోదు చేసింది.
గ్రూప్లోని మొదటి మ్యాచ్లో జపాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న కొలంబియా ఈ మ్యాచ్లో సత్తా చాటింది. తాజా ఓటమితో పోలెండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ నాలుగేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. కొలంబియాకు మూడు పాయింట్లు ఉన్నాయి.
కొలంబియా తన చివరి మ్యాచ్ను సెనెగల్తో ఆడుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిస్తే, ఆ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధిస్తుంది. రష్యా వేదికగా జరుగుతున్న 21వ వరల్డ్ కప్లో టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి యూరోపియన్ జట్టుగా పోలెండ్ నిలిచింది.