
నిమిషానికి 4.7 కోట్ల మంది
దీని ప్రకారం భారత్లో కనీసం నిమిషానికి సుమారు 4.7 కోట్ల మంది ఈ వరల్డ్ కప్లోని మొదటి నాలుగు మ్యాచ్లను చూసినట్లు తెలిసింది. ఈ 4.7 కోట్ల మందిలో టీవీల ద్వారా వీక్షించిన అభిమానులు 4.1 కోటి మంది కాగా, ఆన్లైన్లో 60 లక్షల మంది వీక్షించడం విశేషం.

ఎక్కువ వీక్షకుల సంఖ్య ఈ రాష్ట్రాల నుంచే
భారత్లో ఫుట్బాల్కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, మహారాష్ట్రలలో మాత్రమే ఈ వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ను సుమారు 2 కోట్ల(1.93కోట్ల) మంది చూసినట్లు తెలిసింది.

45 శాతం మంది మహిళలే
ఇందులో 45 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. ఈ వరల్డ్ కప్ను యావరేజిగా భారత్లోని సాకర్ అభిమానులు 39 నిమిషాల పాటు వీక్షించనట్లు పేర్కొంది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటివరకూ భారత్లో ఏ క్రీడను మహిళలు ఈ స్థాయిలో వీక్షించలేదని తెలుస్తోంది.

సోనీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం
రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్కు పెద్ద సంఖ్యలో భారత్ నుంచి వీక్షకులు ఉండటం గొప్ప విషయంగా చెబుతున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ గ్రూప్ స్టేజిలో ఉంది. ఇప్పటికే మొరాకో, ఈజిప్ట్, ఆస్ట్రేలియా జట్లు గ్రూప్ స్టేజి నుంచి నిష్క్రమించాయి. ఈ వరల్డ్కప్ను భారత్లో సోనీ టెన్-2, టెన్-3, సోనీ ఈఎస్పీఎన్ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications














