హైదరాబాద్: పుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలోకి కంగారు అనుకోని అతిథిలా రావడంతో మ్యాచ్కు అరగంటసేపు అంతరాయం కలిగించింది. ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరాలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక మహిళా జట్లు క్యాపిటల్ ఫుట్బాల్ క్లబ్-బెల్కోనెన్ యునైటెడ్ల మ్యాచ్ జరిగింది.
వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఆట తొలి అర్ధభాగం ముగిసిన తర్వాత మహిళా క్రీడాకారిణులంతా విరామం తీసుకునేందుకు వెళ్లారు. విరామ సమయం ముగిసిన తర్వాత క్రీడాకారిణులంతా మైదానంలోకి వచ్చే సరికి ఆరడుగులు ఉన్న ఓ కంగారూ దర్జాగా కూర్చొని ఉంది. దానంతట అదే వెళ్లుపోతుందేమోనని కొద్దిసేపు ఎదురు చూశారు.
అయితే, కంగారూ మాత్రం అలాగే మైదానంలోనే కూర్చుని ఉంది. దీంతో ఓ క్రీడాకారిణి తన చేతిలోని పుట్బాల్ను దానివైపుకి విసిరింది. దాంతో అది అక్కడినుంచి లేచి మైదానంలో పరుగులు ప్రారంభించిందే తప్ప బయటకు వెళ్లలేదు. అలా, అరగంటకు పైగా క్రీడాకారిణులు, అధికారులను బయటకు వెళ్లకుండా పరుగులు పెట్టించించింది.
చివరకు, లాభంలేదనుకున్న టోర్నీ నిర్వాహకులు ఓ జీపును మైదానంలోకి తీసుకువచ్చి కంగారూని పరిగెత్తించడంతో ఎట్టకేలకు అది బయటకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
This kangaroo was just trying to get in on the action 🤣 (via @CapitalFootball) pic.twitter.com/KejD3OVnO1
— Bleacher Report (@BleacherReport) June 24, 2018