బెంగళూరు: కరోనా లాక్డౌన్ కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ప్లేయర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ జీవితంలో ఎన్నడూ ఊహించని, లభించని ఇంతటి విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అంతకన్నా మరో ఆప్షన్ కూడా వారికిలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్రికెట్, తమ వ్యక్తిగత కెరీర్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. త్రోబ్యాక్ మూమెంట్స్ను షేర్ చేసుకుంటున్నారు.
తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్లు సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో చిట్ చాట్ చేశారు. క్రికెట్కు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ధోనీ భవితవ్యంపై చర్చించారు. ముంబై-చెన్నై ఆల్టైమ్ టీమ్ను ఎంపిక చేశారు. అయితే ఈ ఇద్దరి లైవ్ సెషన్ సజావుగా సాగుతుంటే వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాడు.. టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. గత కొంతకాలంగా ఇదే తన పనిగా పెట్టుకున్న చహల్.. సెలబ్రిటీల లైవ్ సెషన్స్ మధ్య దూరుతూ.. పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వారితో చివాట్లు తింటున్నాడు. ఆఖరికి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ను కూడా ఈ లెగ్ స్పిన్నర్ వదల్లేదు. లాక్డౌన్లోని తన ఫిట్నెస్ గురించి చెబుతూంటే హాయ్ మామ్ అంటూ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె అంటే తనకు ఇష్టమని తెలిపాడు.
Some screenshots from Rohit - Raina instagram Live chat pic.twitter.com/IG0ic5I7B7
— 🐥 (@Rohits_warrior_) May 12, 2020
గతంలో బుమ్రా-రోహిత్ లైవ్ను క్రాష్ చేసి చివాట్లు తిన్న చహల్.. మరోసారి రోహిత్ను విసిగించే ప్రయత్నం చేశాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి టిప్స్ చెప్పండి బద్రర్స్..? లాక్డౌన్లో బరువు పెరగాలంటే ఏం చేయాలి? ప్రతీ ఐపీఎల్లో మీ ఇరు జట్లు 400కు పైగా స్కోర్లు ఎలా చేస్తున్నాయనే వరుస కామెంట్స్తో వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక అతని గురించి తెలిసిన రోహిత్-రైనా అతని కామెంట్లు పట్టించుకోకుండా తమ పని చేసుకున్నారు. ప్రస్తుతం చహల్ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చహల్ను జోకర్ అని కోహ్లీ బిరుదిచ్చాడు. వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ అయితే.. బ్లాక్ చేస్తానని చహల్ను హెచ్చరించాడు.
అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్