స్లెడ్జింగ్తో రెచ్చిపోయి..
ఆ మ్యాచ్లో 17వ ఓవర్ వేసిన ఫ్లింటాఫ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. అసహనానికి గురైన ఫ్లింటాఫ్ ఆ ఓవర్ ఆఖరి బంతికి నాన్స్ట్రైక్ ఎండ్వైపు వెళ్తున్న యువీ నోరుపారేసుకున్నాడు. దీనికి యూవీ కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి ఆఖరికి ఫీల్డ్ అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మరుసటి ఓవర్ స్టువర్ట్ బ్రాడ్ వేయగా ఫ్లింటాఫ్పై ఉన్న కోపాన్ని యువరాజ్ బంతిపై చూపించాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ ఆ అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
హిట్టింగ్తోనే బదులివ్వాలని..
'ఫ్లింటాఫ్ బౌలింగ్లో రెండు బౌండరీలు కొట్టాను. దాంతో అసహనానికి గురైన అతను మరో ఎండ్కు నడుచుకుంటు వెళ్తున్న నాపై నోరుపారేసుకున్నాడు. అప్పుడు అతను ఏం అన్నాడో అనేది మాత్రం సరిగ్గా చెప్పలను. కానీ నేను రెండు పేలవ షాట్లు ఆడాను అని మాత్రం చెప్పాడు. నేను కూడా ఏ అంటున్నావని బదులివ్వడంతో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. 'నీ గొంతు కొస్తా'అని నన్ను హెచ్చరించాడు. దాంతో నేను కూడా 'నా చేతిలోని బ్యాట్ను చూస్తున్నావు కదా.. దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు'అని బదులిచ్చా. ఆ టైమ్లో మా మధ్య చాలా సీరియస్ ఫైట్ జరిగింది. ఆ తర్వాత ఓవర్లో ప్రతీ బంతినీ స్టేడియం బయట కొట్టాలని నిర్ణయించుకున్నా.
ఫ్లింటాఫ్ వైపు ఓ చిరునవ్వు..
అదృష్టవ శాత్తు బ్రాడ్ వేసిన తొలి బంతినే మైదానం బయటకు కొట్టాను. రెండో బంతిని ప్రేక్షకుల స్టాండ్స్లోకి, మూడు బంతిని ఓవర్ పాయింట్ మీదుగా బాదాను. అయితే అప్పటి వరకు నా కెరీర్లోనే నేను ఆ షాట్ ఆడలేదు. కోలింగ్ వుడ్ బ్రాడ్ దగ్గరకు వచ్చి ఔట్ సైడ్ ఆఫ్ యార్కర్ బంతులు వేయాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఆఫ్ సైడ్ బౌండరీ చాలా దూరంగా ఉంది. కానీ బ్రాడ్ బంతిని నా లెగ్స్ వేసాడు. లెగ్ సైడ్ బౌండరీ చిన్నది కావడంతో ఫ్లింటాఫ్ మీదుగా దూసుకెళ్లింది. ఆరో బంతి అతను కచ్చితంగా యార్కర్ వేస్తాడని ఊహించా. స్ట్రైట్ ఆడేందుకు రెడీ అయ్యా.. అది నా బలమైన జోన్. చివరి సిక్సర్ బాది ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వాను'అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీ ఆశించి..
2007 టీ20 ప్రపంచకప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీకి బదులు తనకే జట్టు సారథ్య బాధ్యతలు ఇస్తారని భావించానని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. కానీ సెలెక్టర్లు ధోనీని కెప్టెన్ చేశారని, దాంతో టీమ్ మెంబర్గా అతనికి మద్దుతుగా నిలిచానని ఈ సిక్సర్ల సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఇక కెప్టెన్సీ చేజారినా టీమ్ మ్యాన్గా యువీ ఈ టోర్నీలో సత్తా చాటాడు. 6 మ్యాచ్ల్లో 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్స్లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఆ విధ్వంసంతో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే చెక్కుచెదరకుండా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.