
మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం..
'ఫైనల్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కాస్త ఇబ్బందికరమే. నాకు గుర్తున్న మేరకు ఆస్ట్రేలియా సిరీసుకు ముందు టీమిండియా కొన్ని సన్నాహక మ్యాచులు ఆడింది. అడిలైడ్లో 36కే ఆలౌటైనా, సీనియర్లు గాయపడ్డా భారత్ టైటిల్ గెలిచింది. టెస్టు సిరీసులో ఆడకముందే క్రికెటర్లు పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఆసీస్పై సిరీస్ విజయం అద్భుతం. జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించింది. భారత క్రికెట్లో ఎలాంటి ప్రతిభావంతులు ఉన్నారో ఆస్ట్రేలియా పర్యటన ప్రపంచానికి చూపించింది.

బౌలర్లకు సన్నాహకం..
ఏదేమైనా సన్నాహక మ్యాచులు ఆడటం, మధ్యలో నిలవడం ముఖ్యం. మ్యాచ్ ప్రాక్టీస్ను మించిందేం లేదు. మనం నెట్స్లో సాధన చేసుండొచ్చు. కానీ మ్యాచ్ పరిస్థితుల్లో నిలవడం భారీ మ్యాచుల్లో ఉపయోగకరం. బ్యాటర్లకే కాదు బౌలర్లకూ సన్నాహకం కీలకమే. ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి దేశంలో ఎక్కడ బంతులు విసరాలో వారికి అర్థమవుతుంది. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారని, అయితే వాళ్లు తగిన మ్యాచ్ ప్రాక్టీస్తోనే రాణించారనే విషయాన్ని మరవదు.'అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.

కివీస్కు కలిసొస్తుంది..
ప్రస్తుతం భారత్ మెరుగైన జట్టని, గొప్ప ఫామ్లో ఉందని వెంగ్సర్కార్ ప్రశంసించాడు. న్యూజిలాండ్పై అంచనాలు తక్కువగా ఉండటం కూడా వారికి కలిసొచ్చే మరో అంశంగా పేర్కొన్నాడు. ఫైనల్కు ముందే ఇంగ్లండ్తో వారు రెండు టెస్టులు ఆడటం వల్ల పరిస్థితులపై వారికి అవగాహన వస్తుందని వెల్లడించారు. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా భారత్, కివీస్ ఫైనల్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్ చాంపియన్షిప్ కావడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












