వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్ చేరింది. గుజరాత్ జెయింట్స్తో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. భార్తీ ఫుల్మాలి(36 బంతుల్లో 7 ఫోర్లతో 42), కాథ్రిన్ బ్రైస్(22 బంతుల్లో 4 ఫోర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరజన్నే కాప్, శిఖా పాండే, మిన్ను మణి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వార్(2/20) రెండు వికెట్లు తీసారు.

ఈ టోర్నీ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆర్సీబీ శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.