For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2023: ఆర్‌సీబీ సంచలన విజయం.. రసవత్తరంగా ప్లేఆఫ్స్‌!

WPL 2023 playoff qualification scenario After RCB big 8-wicket win over Gujarat Giants

హైదరాబాద్: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయాన్నందుకుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత యూపీ వారియర్స్‌పై గెలుపొందిన ఆర్‌సీబీ.. శనివారం గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. సోఫీ డివైన్(36 బంతులు.. 9 ఫోర్లు.. 8 సిక్సర్లు.. 99) విధ్వంసకర బ్యాటింగ్‌తో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు రసవత్తరంగా మారాయి. ఆర్‌సీబీ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాగా.. మూడో ప్లేస్ కోసం ఆర్‌సీబీతో పాటు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.

6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఇప్పటికే ముంబై ఇండియన్స్ (10 పాయింట్లు) ప్లేఆఫ్స్‌ చేరగా.. 6 మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ (8) కూడా ముందంజ వేసింది. మిగతా మూడు జట్లలో ఏదీ 8 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బెర్తు ఖరారైంది. ఇక మూడో ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం యూపీ వారియర్స్ (6 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు), బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు), గుజరాత్‌ (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు) మధ్య పోటీ నెలకొంది. లీగ్‌ దశలో ప్రతి జట్టూ 8 మ్యాచ్‌లు ఆడుతుంది.

బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడా విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే ఆర్‌సీబీ‌కి అవకాశం ఉంటుంది. అయితే యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

WPL 2023 playoff qualification scenario After RCB big 8-wicket win over Gujarat Giants

యూపి వారియర్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకదాంట్లో ఓడితే మాత్రం మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తోంది. గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తోంది. అయితే ఆ జట్టు రన్‌రేట్ మెరుగ్గా లేకపోవడం ప్రతికూలాంశం.

WPL 2023 playoff qualification scenario After RCB big 8-wicket win over Gujarat Giants

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్‌ ( 42 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఆష్లీ గార్డ్‌నర్‌ ( 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు. అనంతర ఆర్‌సీబీ సోఫీ డివైన్ సంచలన ఇన్నింగ్స్‌‌తో 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన ( 31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37) కూడా లీగ్‌లో తొలిసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడింది. టోర్నీలో రెండో విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Story first published: Sunday, March 19, 2023, 8:35 [IST]
Other articles published on Mar 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+