హోటల్ దొరకడం లేదంట..
అంత ధనికమైన క్రికెట్ బోర్డుకు హోటల్ దొరకడం లేదంట. పెళ్లిళ్ల సీజన్తో హోటల్సన్నీ బుక్ అవ్వడం.. బీసీసీఐకి సమస్యగా మారిందంట. మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు నడుం బిగించిన బీసీసీఐ.. ఐపీఎల్ తరహాలో వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది.
ఇప్పటికే 5 జట్లు, మీడియా రైట్స్ అమ్మకాల ద్వారా రూ.5వేల కోట్లు ఆర్జించిన బీసీసీఐ.. ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహించడంపై దృష్టిసారించింది. ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐకి హోటల్ దొరకడం లేదని క్రిక్బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
డబ్ల్యూపీఎల్ వేలం కోసం..
ఈ నెల రెండో వారంలో డబ్ల్యూపీఎల్ మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ.. హోటల్ వెతికే పనిలో ఉందంట. హోటల్ దొరికేదాన్ని బట్టి తేదీని ఖారారు చేయాలనుకుంటుందంట. అయితే భారత్లో ఫిబ్రవరి 8-16 వరకు పెళ్లిళ్లు, ఫంక్లన్ల సీజన్ కావడంతో హోటల్స్కు విపరీతమైన డిమాండ్ ఉందట. గత 6 నెలలుగా ముహుర్తాలు లేకపోవడంతో చాలా మంది శుభాకార్యలు చేసుకోలేదు.
ఇప్పుడు సీజన్ కావడంతో హోటల్స్కు డిమాండ్ ఏర్పడింది. ఇది బీసీసీఐకి సమస్యగా మారింది. అయితే ప్రపంచ క్రికెట్ను శాసించే బీసీసీఐకి హోటల్స్ దొరకడం లేదనే మాట చాలా సిల్లీగా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బీసీసీఐ తలుచుకుంటే హోటల్నే కొనేయగలదని సెటైర్లు పేల్చుతున్నారు.
5 జట్లు 22 మ్యాచ్లు..
ఐదు జట్ల మధ్య జరగనున్న డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లన్నీ ముంబైలోని బార్బోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. లీగ్ మార్చి తొలి వారంలో ప్రారంభమై చివరి వారంలో ముగిసే అవకాశం ఉంది. ఐదు జట్ల విక్రయాల ద్వారా బీసీసీఐకి రూ.4,669.99 కోట్లు రాగా.. వచ్చే ఐదేళ్ల మీడియా రైట్స్ను రిలయన్స్కు చెందిన వయాకామ్ సంస్థ రూ.951 కోట్లకు కొనుగోలు చేసింది.
అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.