
సిల్లేట్: మహిళల క్రికెట్లో థాయ్లాండ్ సంచలనం సృష్టించింది. మహిళల ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్ మహిళలతో జరిగిన మ్యాచ్లో థాయ్లాండ్ మహిళలు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 116 పరుగులు చేసింది. సిద్రా అమీన్(64 బంతుల్లో 6 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగత బ్యాటర్లు విఫలమయ్యారు. థాయ్లాండ్ బౌలర్లో సోర్నారిన్ రెండు వికెట్లు తీయగా.. తిపట్చా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన థాయ్లాండ్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నత్తకన్ చంతమ్(61) హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ బౌలర్లలో నిదా దర్, టుబా హస్సన్ రెండేసి వికెట్లు తీయగా.. నష్రా సంధు, కైనత్ ఇమ్తియాజ్ తలో వికెట్ తీసారు. మహిళల క్రికెట్లో థాయ్లాండ్కు ఇదే అతిపెద్ద విజయం.
పాయిట్స్ టేబుల్లో మూడు విజయాలు నమోదు చేసిన భారత మహిళల జట్టు అగ్రస్థానంలో ఉండగా..2 విజయాలతో పాకిస్థాన్ మహిళల జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. థాయ్లాండ్ తొలి విజయంతో పాయింట్ల ఖాతా తెరిచి ఐదో స్థానంలో నిలిచింది.