న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మాయిలు ముంబై వచ్చేయండి.. ఐపీఎల్ కోసం బీసీసీఐ పిలుపు!

Womens IPL: BCCI asked to Players assemble on October 13

న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్‌ సిరీస్‌ పేరిట నిర్వహించే మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మరో ముందుడగు పడింది. ఈ లీగ్ కోసం భారత మహిళా క్రికెటర్లను ఈనెల 13న ముంబైకి రావాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. మొత్తం 30 మంది క్రికెటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. 'క్రికెటర్లకు సమాచారమిచ్చాం. వాట్సప్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేశాం. అండర్‌-19 ప్లేయర్లు కొందర్ని ఎంపిక చేశాం' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

పలుమార్లు కోవిడ్‌-19 పరీక్షల అనంతరం అక్టోబర్‌ 22న యూఏఈ బయల్దేరి వెళ్లనున్నారు. మరో వారం రోజుల క్వారంటైన్‌ అనంతరం బయో బబుల్‌లో అడుగుపెడతారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్‌ లేకుండానే టోర్నీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ అంశంపైనే ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో లీగ్‌కు ప్రిపేర్ కావడం సవాలేనని ఓ ప్లేయర్ అభిప్రాయపడింది. వెటరన్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్‌ల 'మహిళల టీ20 చాలెంజర్‌ టోర్నీ' షార్జా వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 మధ్య నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతుంది.

పులికాస్త పిల్లి అయింది.. బట్లర్, శాంసన్‌, పంత్‌పై నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!పులికాస్త పిల్లి అయింది.. బట్లర్, శాంసన్‌, పంత్‌పై నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

Story first published: Saturday, October 10, 2020, 10:56 [IST]
Other articles published on Oct 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X