శ్రీలంక పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియాకు 42 రోజుల విశ్రాంతి లభించనుంది. గతేడాదిగా కిక్కిరిసిన షెడ్యూల్తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లకు ఈ 42 రోజుల విశ్రాంతి ఉపశమనం కలిగించనుంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 3-0తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే.. రోహిత్ సేన మాత్రం 0-2తో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆటగాళ్లు అంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్తో టీమ్ హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.

రెండు టెస్ట్లు, మూడు టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్.. భారత్కు రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్షిప్ 2025లో భాగంగా జరిగే ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గెలవడం భారత్కు చాలా ముఖ్యం. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్ ఈ సిరీస్ను గెలవాల్సిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు సొంత గడ్డపైనే ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
టీమిండియా తదుపరి షెడ్యూల్..
1. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్లు, మూడు టీ20లు
తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు
తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్, రాత్రి 7 గంటలకు
2. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్..
తొలి టెస్ట్: అక్టోబర్ 16-20, బెంగళూరు, ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: అక్టోబర్24- 28, పుణే, ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్: నవంబర్ 1 నుంచి 5, ముంబై, ఉదయం 9.30 గంటలకు
3. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్ల సిరీస్)
తొలి టెస్ట్: నవంబర్ 22-26, పెర్త్, ఉదయం 7.50 గంటలకు
రెండో టెస్ట్(పింక్ బాల్): డిసెంబర్ 6-10, అడిలైడ్, ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్: డిసెంబర్ 14-18, బ్రిస్బేన్, ఉదయం 5.50 గంటలకు
నాలుగో టెస్ట్: డిసెంబర్ 26-30, మెల్బోర్న్, ఉదయం 5.00 గంటలకు
ఐదో టెస్ట్: జనవరి 03-07, సిడ్నీ, ఉదయం 5.00 గంటలకు