
అసోసియేషన్ గొడవలే కారణం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. హెచ్సీఏలో అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు ఎవరికి వారే అనే తీరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీసం హైదరాబాద్ రంజీ జట్టును సిద్దం చేయడంలోనూ విఫలమయ్యారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు.

అందుకే పట్టించుకోలేదు..
ఏటా జరగాల్సిన ఏజీఎంను కూడా హెచ్సీఏ నిర్వహించలేకపోయింది. అనామకులను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. హెచ్సీఏలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలతో బీసీసీఐ పెద్దలు కూడా విసుగు చెందారు. ప్రొఫెషనల్గా నడిపించాల్సిన అసోసియేషన్ను రాజకీయ గొడవలకు కేంద్రంగా మార్చారని బోర్డు ఆగ్రహంతో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అందుకే, ఐపీఎల్ను హైదరాబాద్లోనూ నిర్వహించాలని స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ ప్రకటన చేసినా బీసీసీఐ పట్టించుకోలేదని సదరు అధికారి పేర్కొన్నాడు.

రైతు ఉద్యమంతో..
ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నడుస్తున్నది. గతేడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనల్లో పంజాబ్ రైతులదే కీలక పాత్ర. ఇలాంటి సమయంలో మొహాలిలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తే రైతులు అడ్డుకునే అవకాశం ఉన్నట్లు బీసీసీఐకి సమాచారం అందినట్లు ఒక అధికారి తెలిపారు. ఐపీఎల్ స్టేడియం వెలుపల ఆందోళనలు జరిగితే అది బ్రాండింగ్కు నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతోనే మొహాలిని తప్పించినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ గప్ చుప్
గుజరాత్లో ఎలాంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేవు. కానీ, గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అహ్మదాబాద్లో కొన్ని మ్యాచ్లు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జైపూర్ను తాత్కలికంగా పక్కనపెట్టి అహ్మదాబాద్ మొతేరాను వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయంలో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. అందుకే ఆ యాజమాన్యం జైపూర్ వేదికపై పెద్దగా పట్టుబట్టడం లేదంటున్నారు. ఏదేమైనా ఆ మూడు వేదికలను జాబితా నుంచి తప్పించడానికి కరోనా ముఖ్య కారణం కాదని, వేరే కారణాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications












