For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's World Cup 2025 ఫైనల్ రద్దయితే.. విజేత ఎవరంటే?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. టైటిల్ ఫైట్‌కు టీమిండియాతో పాటు సౌతాఫ్రికా అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సౌతాఫ్రికా ఫైనల్ చేరగా.. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది. 339 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించి సగర్వంగా ఫైనల్‌ చేరింది.

అయితే ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా.. చిరు జల్లులు మ్యాచ్‌కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కూడా చిరు జల్లలు పడ్డాయి. కానీ మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కానీ ఆదివారం 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని అంచనా వేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సోమవారం(నవంబర్ 3) రిజర్వ్‌డేగా కేటాయించారు.

What Happens If India vs South Africa Women s World Cup 2025 Final Is Washed Out

రిజర్వ్ డే కూడా..

ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం ఆటను కొనసాగిస్తారు. ఒక సారి టాస్ వేస్తే.. ఆ మ్యాచ్‌ను లైవ్‌గా పరిగణిస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే సోమవారం కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన అయితే లేదు. ఇది అభిమానులకు ఉపశమనం ఇస్తోంది.

ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడేలా చూస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. కానీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ ఫైనల్‌కు అలాంటి పరిస్థితి అయితే లేదు. 20 ఓవర్ల చొప్పున కనీసం 20 ఓవర్ల ఆట అయినా సాధ్యమవుతుంది.

రెట్టించిన ఆత్మవిశ్వాసంతో భారత్

పటిష్టమైన ఆసీస్ ఓడించి ఫైనల్ చేరిన భారత్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్లో సౌతాఫ్రికాని ఓడించడం భారత్‌కే ఏం కష్టం కాకపోవచ్చు. కానీ సెమీఫైనల్ తరహాలో సమష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఉండాలి. కట్టడిగా బౌలింగ్ చేయాలి. భారత్ తరహాలో సౌతాఫ్రికా కూడా ఇప్పటి వరకు మహిళల వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఆ జట్టు కూడా తొలి టైటిల్ కోసం గట్టిగా పోరాడనుంది.

సౌతాఫ్రికా జట్టు గ్రూప్ దశలో 7 మ్యాచ్‌లలో 5 గెలిచి సెమీఫైనల్ చేరగా.. భారత్ జట్టు మాత్రం 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. టీమిండియాలో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, యువ ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ప్రధాన బలంగా మారింది. సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు కూడా భారత జట్టుకు గొప్ప ప్రేరణ అవుతుంది. అంతేకాకుండా నవీ ముంబై వేదికగానే గత నాలుగు మ్యాచ్‌లను భారత్ ఆడటం కలిసొచ్చే అంశం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అరగంట ముందు 2:30 గంటలకు టాస్ వేస్తారు.

Story first published: Friday, October 31, 2025, 12:57 [IST]
Other articles published on Oct 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+