భారీ స్కోరు చేయాలనుకున్నా:
సెంచరీ, అర్ధ సెంచరీతో సత్తా చాటిన హనుమ విహారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'తొలి టెస్ట్ సెంచరీ సాధించడం చాలా గొప్పగా ఉంది. గత మ్యాచ్లో సెంచరీ ముందు ఔట్ అయ్యాను. ఈసారి ఎలా అయినా భారీ స్కోరు చేయాలని నిర్ణయించుకున్నా. 200 పరుగులకు 5 వికెట్లు కోల్పోయినప్పుడు రిషబ్ పంత్ అండతో పరుగులు చేయాలనుకున్నా. ఫాస్ట్ బౌలర్లకు ఈ వికెట్ అనుకూలిస్తున్న నేపథ్యంలో ఓపిక పట్టా. అయితే స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగడం ఫలితాన్ని ఇచ్చింది' అని విహారి తెలిపాడు.
ఎంతో త్రిల్గా ఉంది:
'ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచులు ఆడాను. సొంత గడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. సొంత పేక్షకుల మధ్య ఆడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫిలింగ్ తలుచుకుంటే ఎంతో త్రిల్గా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికి స్వేచ్ఛను ఇచ్చాడు. డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మరిన్ని మంచి ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నిస్తా' అని విహారి అన్నాడు.
నాన్నకు అంకితం:
'ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్ల వయస్సులో మా నాన్న చనిపోయాడు. భవిష్యత్లో అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆయన ఎక్కడున్నా ఈ రోజు నా ఆట చూసి గర్వించే ఉంటారు. ఈ ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. ఈ సెంచరీలో ఇషాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. నాకంటే కూడా ఇషాంతే అసలైన బ్యాట్స్మన్గా కనిపించాడు' అని మూడో రోజు మ్యాచ్ అనంతరం విహారి చెప్పుకొచ్చాడు.
257 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రోహిత్ శర్మకు కష్టమే:
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రహానే అండగా రెచ్చిపోయిన విహారి.. రెండో టెస్టులో సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకున్నా అదరగొట్టాడు. విండీస్ పేసర్లు హోల్డర్, రోచ్ నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా సూపర్ సెంచరీ (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా కీలక అర్ధ శతకం చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రోహిత్ శర్మ టెస్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాడు.