బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపాడు. బంతితో పాటు బ్యాట్తో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సెంచరీతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్ట్లోనూ ఐదు వికెట్లు తీసాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్ల్లో ఓ సెంచరీతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు.
ఈ క్రమంలో అతను శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ వరల్డ్ రికార్డ్ను సమం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఆటగాడిగా.. ముత్తయ్య మురళీధరణ్తో కలిసి అశ్విన్ సమంగా నిలుచున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు అందుకున్నారు. మరోసారి అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిస్తే.. ముత్తయ్య మురళీధరణ్ను అధిగమిస్తాడు.

వాస్తవానికి అశ్విన్.. తాజా అవార్డుతోనే ఈ రికార్డ్ను బ్రేక్ చేయాలి. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యంతో చేసిన పనికారణంగా ఈ ప్రపంచ రికార్డ్ను అశ్విన్ అందుకోలేకపోయాడు.
గతేడాది టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా అశ్విన్ 15 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇవ్వలేదు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ అవార్డు ఇవ్వలేకపోయాడు. ఈ టోర్నీకి స్పాన్సర్ చేసిన భారత కంపెనీ.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వలేదని వెస్టిండీస్ బోర్డు తెలిపింది.
కానీ కమర్షియల్ కార్యక్రమాల వరకే తమ బాధ్యత ఉంటుందని, అవార్డులు బోర్డు చూసుకోవాల్సిందేనని సదరు కంపెనీ స్పష్టం చేసింది. దాంతో ఈ సిరీస్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లేకుండా పోయింది. ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చి ఉంటే అశ్విన్నే వరించేది. అతనికి పోటీగా యశస్వి జైస్వాల్ మాత్రమే 266 పరుగులు చేశాడు. మరే బౌలర్ కూడా 7 వికెట్లు పడగొట్టలేదు.
అశ్విన్కు అప్ప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చి ఉంటే తాజా అవార్డుతో అతను ముత్తయ్య మురళీధరణ్ రికార్డును అధిగమించేవాడు.