కొలంబో: మూడు వన్డేల సిరీస్లో భాంగంగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక అద్బుత విజయాన్నందుకుంది. చివరి ఓవర్దాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టేయిలండర్ హసరంగా (39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 42 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో వికెట్ తేడాతో గెలుపొందింది.
ఫలితంగా సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. షై హోప్ (115; 10 ఫోర్లు) శతకంతో రాణించాడు. ఇసురు ఉదానకు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్లో అవిష్క ఫెర్నాండో (50; 5 ఫోర్లు, సిక్స్), దిముత్ కరుణరత్నే (52; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (42; 4 ఫోర్లు) రాణించారు. మిడిలార్డర్ తడబడ్డా... చివర్లో తిసారా పెరీరా (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వనిందు హసరంగ డిసిల్వా (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడి మిగతా పనిని పూర్తి చేశారు.
విండీస్ బౌలర్లో అల్జారీ జోసెఫ్, షెల్డన్ కొట్రెల్కు మూడు వికెట్లు దక్కాయి. కీమో పాల్, హేడెన్ వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. రెండో వన్డే ఈ నెల 26న జరుగుతుంది.