టెస్ట్ చరిత్రలోనే ఓ మైలురాయి..
స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్మణ్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు.వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
ఔటవ్వద్దని ఆ దేవుడు కోరుకున్నా..
ఆనాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ఇటీవల ఈ మ్యాచ్కు సంబంధించిన క్షణాలను నెమరవేసుకున్నాడు. ఆ మ్యాచ్ ఆసాంతం ద్రవిడ్-లక్ష్మణ్ ఔటవ్వద్దని దేవుడిని ప్రార్ధించానని తెలిపాడు. ‘ఆ మ్యాచ్లో రాహుల్-ద్రవిడ్ ఆడుతున్న సమయంలో టవల్తో ఓ మూలకు కంప్యూటర్ పర్సన్ వెనుకాల కూర్చున్నాను. లక్ష్మణ్, ద్రవిడ్ ఔటవ్వద్దని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. కానీ అద్భుతం జరిగింది. టెస్ట్ చరిత్రలోనే అదో అద్భుతమైన మ్యాచ్. దేవుని మ్యాచ్.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ప్రధాని నోట కూడా..
భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం 'పరీక్షాపే చర్చ' కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుని ప్రస్తావించారు.
"మన జట్టు కష్టాల్లో పడింది. ఆటగాళ్ల మూడ్కూడా బాగాలేదు. ఆ స్థితిలో లక్ష్మణ్, ద్రవిడ్ ఆడిన ఇన్నింగ్స్ను మరిచి పోగలమా. వారు మ్యాచ్ను మనవైపు తిప్పారు" అని ప్రధాని మోడీ ఈ టెస్టుని గుర్తు చేశారు. "అలాగే 2002లో వెస్టిండీ్సతో ఆంటిగ్వా టెస్ట్లో గాయపడి కుంబ్లే బౌలింగ్ చేయడాన్ని మరువగలమా? ఇవన్నీ మనల్ని ఉత్తేజితం చేసే సంఘటనలే. ఆశావహ దృక్పథాన్ని కలిగించేవే" అని తెలిపారు.