మంచి టచ్లో కోహ్లీ...
రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 100 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్లో తన స్టైల్లో 68.37 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి బ్యాక్ టు ది ఫామ్ అనిపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ధారాళంగా పరుగులు చేస్తాడనే నమ్మకం వచ్చిందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. సోనీ నెట్వర్క్లో 'ఎక్స్ట్రా ఇన్నింగ్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్... 'విరాట్ కోహ్లీ చివరిసారిగా సెంచరీ ఎప్పుడు చేశాడో మీకు గుర్తుందా? నాకు కూడా గుర్తు లేదు...
ఈ సారి సెంచరీ ఖాయం..
అయితే ఈసారి సిరీస్ డిసైడర్లో ఎడ్బస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని నాకు అనిపిస్తోంది. అతని చెడ్డ రోజులన్నీ పోయాయి. ఇక్కడితో ముగిసిపోయాయి. ఇప్పటికే మంచి రోజులు మొదలైపోయాయి... వార్మప్ మ్యాచ్లో అతను ఓ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అమూల్యమైన 33 పరుగులు చేశాడు... ఈ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ చూస్తుంటే అతను పూర్తి ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది...' అంటూ కామెంట్ చేశాడు...
మూడేళ్ల కిందట సెంచరీ..
చివరిసారిగా 2019లో వెస్టిండీస్పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2021 ఇంగ్లండ్ టూర్లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా వాయిదా పడిన చివరి టెస్ట్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. అతను జట్టుకు దూరమైతే.. బుమ్రా సారథ్యం వహించనున్నాడు.