న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ దరిద్రం పోయింది.. ఇక అన్నీ మంచి రోజులే: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag Feels Virat Kohli’s Bad Days Are Over

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దరిద్రం పోయిందని, ఇక నుంచి అన్నీ మంచి రోజులేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతను సత్తా చాటుతాడని జోస్యం చెప్పాడు. లీస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 69 బంతులాడి 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... రెండో ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

మంచి టచ్‌లో కోహ్లీ...

మంచి టచ్‌లో కోహ్లీ...

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 100 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌లో 68.37 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి బ్యాక్ టు ది ఫామ్ అనిపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ధారాళంగా పరుగులు చేస్తాడనే నమ్మకం వచ్చిందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. సోనీ నెట్‌వర్క్‌లో 'ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్... 'విరాట్ కోహ్లీ చివరిసారిగా సెంచరీ ఎప్పుడు చేశాడో మీకు గుర్తుందా? నాకు కూడా గుర్తు లేదు...

 ఈ సారి సెంచరీ ఖాయం..

ఈ సారి సెంచరీ ఖాయం..

అయితే ఈసారి సిరీస్ డిసైడర్‌లో ఎడ్బస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని నాకు అనిపిస్తోంది. అతని చెడ్డ రోజులన్నీ పోయాయి. ఇక్కడితో ముగిసిపోయాయి. ఇప్పటికే మంచి రోజులు మొదలైపోయాయి... వార్మప్ మ్యాచ్‌లో అతను ఓ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అమూల్యమైన 33 పరుగులు చేశాడు... ఈ మ్యాచ్‌‌లో విరాట్ బ్యాటింగ్ చూస్తుంటే అతను పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది...' అంటూ కామెంట్ చేశాడు...

మూడేళ్ల కిందట సెంచరీ..

మూడేళ్ల కిందట సెంచరీ..

చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2021 ఇంగ్లండ్ టూర్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా వాయిదా పడిన చివరి టెస్ట్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. అతను జట్టుకు దూరమైతే.. బుమ్రా సారథ్యం వహించనున్నాడు.

Story first published: Monday, June 27, 2022, 15:38 [IST]
Other articles published on Jun 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X