ముంబై: కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్లో ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.
ప్రతీవిషయంపై స్పందిస్తూ.. అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడు. అలాగే సరదా పోస్టులతో అలరిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో ఉన్న ఓ ఫొటోను విరాట్ ట్వీట్ చేశాడు. అది ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ సందర్భంగా లాబీలో అతనితో మాట్లాడుతూ నడుస్తున్న ఫొటోకాగా.. అతనితో మాట్లాడటం ఎప్పుడూ బాగుంటుదని, విలియమ్సన్ మంచివాడని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
ఇక విలియమ్సన్, కోహ్లీ సుదీర్ఘకాలంగా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. 2008లో జరిగిన అండర్-19 వరల్డ్కప్ నుంచి వీరి మధ్య స్నేహాం మొదలైంది. వీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే.. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నా బౌండరీ లైన్ వద్ద కూర్చొని కబుర్లు చెప్పుకునేంత. న్యూజిలాండ్ టూర్లో ఐదో టీ20కి గాయం కారణంగా విలియమ్సన్, విశ్రాంతితో కోహ్లీ దూరమయ్యాడు. ఓవైపు ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుంటే.. మరోవైపు ఈ ఇద్దరూ బౌండరీ లైన్ వద్ద సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అప్పట్లో ఈ ఫొటో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూర పరిచింది. వీరి మధ్య ఉన్న స్నేహానికి అభిమానులంతా ఫిదా అయ్యారు.
అప్పట్లో ఈ విషయంపై కోహ్లీని ప్రశ్నించగా.. 'కేన్ది నాది ఒకే మైండ్ సెట్. ఒకే ఫిలాసఫీ. మా ఆలోచన విధానం కూడా ఒకేలా ఉంటుంది. ఇద్దరమే ఒకేలా మాట్లాడుతాం. న్యూజిలాండ్ క్రికెట్ మంచి వ్యక్తి చేతుల్లో పడిందని నేను భావిస్తున్నా. ఆ జట్టును నడిపించడానికి విలియమ్సన్ సరైనవాడు. నాయకుడిగా అతను ఫర్ఫెక్ట్. భవిష్యత్తులో కూడా అతని సారథ్యం బాగుండాలని కోరుకుంటున్నా. న్యూజిలాండ్తో ఆడటానికి ప్రతీ ఒక్కరు ఇష్టపడుతారు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!