
కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఇబ్బంది పడ్డా..
'సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆటగాడిగా జట్టులో సర్దుకోవడానికి కొద్ది రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే సారథ్యం వహించిన ప్రతీ ఒక్కరికీ ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. పైకి అలాంటిదేం లేదని చెప్పినా.. కెప్టెన్గా జట్టులో జరిగే ప్రతీ చిన్నదానికి బాధ్యత వహించి ఒక్కసారిగా ఆ స్థానంలో లేమనే నిజాన్ని గ్రహించడం చాలా కష్టం. కెప్టెన్ను కాదనే విషయాన్ని వొంటబట్టించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. జట్టులో ఓ సాధారణ ప్లేయర్గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

నువ్వు కెప్టెన్ కాదు బాస్..
కెప్టెన్సీ అలవాటులో భాగంగా మైదానంలో కొన్నిసార్లు ఏదో నిర్ణయం తీసుకోవడానికి, సలహాలు చెప్పడానికి ముందుకు వచ్చేవాడిని. ఆ వెంటనే 'నువ్వు కెప్టెన్ కాదురా అయ్యా'అనే విషయాన్ని నాకు నేను చెప్పుకునేవాడిని. చాలాసార్లు ఏదో చెప్పాలని అనుకునేవాడిని. అలా చాలా సార్లు.. అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి వెనకడుగు వేసేవాడిని. నిర్ణయం తీసుకున్నాక మనం అభిప్రాయం చెప్పడం కూడా మంచిది కాదు. మన అభిప్రాయానికి విలువ లేదని తెలిసినా చెప్పడం అవివేకమే అవుతుంది.

సహచర ఆటగాళ్లు గౌరవం ఇవ్వరు..
జట్టులో కెప్టెన్సీ హోదా అనుభవించిన తర్వాత ఓ సాధారణ ప్లేయర్గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. జట్టులో మనల్ని ఒకలా చూసిన వాళ్లు కూడా సారథ్యం కోల్పోయిన తర్వాత మరోలా చూడటం మొదలుపెడుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసుని చాలా బాధపెడతాయి.
అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఆర్సీబీ కెప్టెన్సీ విషయంలో నా నిర్ణయం సరైనదే అనిపించింది. ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరకు వెళ్లి, ఇది చేస్తే బాగుంటుందని ఏ విషయాన్నైనా గట్టిగా చెప్పగలను. నా నిర్ణయాన్ని అతను సంతోషంగా స్వీకరిస్తాడు. అది అతను నాకిచ్చే గౌరవం.' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీకి గౌరవం ఇస్తలేడా? అనే చర్చ ఊపందుకుంది.


Click it and Unblock the Notifications
