
గత 10 ఏళ్లుగా ఆడినట్లు..
'ఓ ఆటగాడిగా నాపై నాకున్న అంచనాలే నాకు ముఖ్యం. విమర్శకులు తప్పని నిరూపించాల్సిన స్థితిలో లేను. మైదానంలో ఉన్నందుకు తగిన న్యాయం చేయాలనుకున్నా. టెస్టు క్రికెట్లో గత పదేళ్లుగా ఆడినట్లు ఇటీవల కాలంలో ఆడలేకపోయా. తిరిగి ఆ ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తున్నా. ఆస్ట్రేలియాతో సిరీస్లో నాగ్పూర్లో తొలి ఇన్నింగ్స్ నుంచి ఉత్తమంగానే బ్యాటింగ్ చేశాననుకుంటున్నా.

శ్రేయస్ అయ్యర్ దూరమవడంతో..
గాయంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ కొనసాగించాలనుకున్నా. ఓ బ్యాటర్ తక్కువయ్యాడనే ఉద్దేశంతో ఎక్కువ సేపు ఆడడంపై దృష్టి పెట్టాం. వీలైనంత సేపు జట్టు కోసం క్రీజులో ఉండాలనుకున్నాం. నేను ఆ పనే చేశా. కానీ గతంలో లాగా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయా. ఆ విధంగా చూస్తే నిరాశ కలుగుతోంది. కానీ ఉత్తమంగానే ఆడుతున్నాననే నమ్మకమూ వచ్చింది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

డ్రాకు అంగీకరించడంతో..
ఓవర్నైట్ స్కోరు 3/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా...175/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. భారత్పై 84 పరుగుల ఆధిక్యం సాధించింది. నైట్వాచ్మెన్గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి ఔటవ్వగా.. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90) అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ సిరీస్లో పేలవ ప్రదర్శన కనబర్చిన మార్నస్ లబుషేన్( 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

శతక్కొట్టిన కోహ్లీ, గిల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ( 186), శుభ్మన్ గిల్(128) సెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే తొలి డ్రా. కెరీర్లో 6 టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ కెప్టెన్గా వ్యవహారించాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్.. ఇండోర్లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవి చూశాడు.


Click it and Unblock the Notifications
