
150 మిలియన్ ఫాలోవర్స్
ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో 150 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ను తాజాగా విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన భారత క్రీడాకారుల జాబితాలో తొలి స్థానంలో కోహ్లీ నిలిచాడు. తొలి ఆసియా సెలబ్రెటీగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఏ క్రికెటర్ కూడా ఇంత ఫాలోయింగ్ కలిగిలేరు.
50 మిలియన్ మార్క్ను కూడా ఎవరూ అందుకోలేదు. క్రికెట్ ఆటను శాసిస్తున్న టాప్ జట్ల ఆటగాళ్లు సైతం 50 మిలియన్ మార్క్ను చేరుకోలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, కివీస్ సారథి కేన్ విలియంసన్ లాంటి వారు కూడా 50 మిలియన్ మార్క్ను అందుకోలేకపోయారు.

ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక ఇన్స్టా ఫాలోవర్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుతం రొనాల్డో ఖాతాను అసురించేవారి సంఖ్య 337 మిలియన్లుగా ఉంది. మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ స్టార్ ది రాక్కు 266 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 260 మిలియన్లు, నెయ్మర్ జూనియర్ 160 మిలియన్ల ఫాలోవర్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ నెయ్మర్ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది..సహచరులు చూపుతున్న ప్రేమకు ఆకాశంలో తేలుతున్నా:టీమిండియా పేసర్

ఒక పోస్టుకు రూ.5 కోట్లు
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీకి సంపాదన కూడా అదే రీతిలో ఉంది. ఇన్స్టాలో ఒక ప్రమోషనల్ పోస్టుకు కోహ్లీ రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. హాపర్హెచ్క్యూ 2021 అనే సంస్థ ఇటీవలే 'ఇన్స్టాగ్రామ్ రిచ్లిస్ట్' పేరుతో ఓ జాబితా విడుదల చేసింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇందులో క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్స్టాలో తాను చేసే ఒక్కో పోస్ట్కు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి రూ.11.92 కోట్లు అందుకుంటున్నాడు.
డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్, హాలీవుడ్ సూపర్స్టార్ డ్వేన్ జాన్సన్ రూ.11.92 కోట్లు తీసుకుంటున్నారు. పాప్ సింగర్ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్-20లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అతను 19వ స్థానంలో నిలిచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

23 వేల పరుగులు
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 95 టెస్టులాడి 52.00 సగటుతో 7671 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












