For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘బిడ్డా.. ఇది నీకోసమే’.. హాఫ్ సెంచరీని వామికకు డెడికేట్ చేసిన కోహ్లీ(వీడియో)

 Virat Kohli Dedicates His Half Century to Vamika, does cradle celebration in 3rd ODI vs SA

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా ఓడినా.. మైదానంలో చోటు చేసుకున్న ఓ అపురూప దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీని తన గారాల పట్టీ వామికకు అంకితమిచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న వైఫ్ అనుష్క శర్మ, బిడ్డ వామిక వైపు చూస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

బ్యాట్‌ను చంకలో పెట్టుకొని జోలపాడుతున్నట్లు సైగ చేసిన విరాట్.. ఈ హాఫ్ సెంచరీ నీకోసమే బిడ్డా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అప్పటికే స్టాండ్స్‌లో ఉన్నోళ్లంతా చప్పట్లు కొట్టడం చూసిన కోహ్లీ కూతురు వామిక కూడా వారిని అనుకరిస్తూ చప్పట్లు కొట్టింది.

వామిక ఫేస్ రివీల్..

ఈ టైమ్‌లో కెమెరాలన్నీ అటు వైపే ఫోకస్ చేయడంతో తొలిసారి వామిక రూపం అందరికి కనబడింది. ఇన్నాళ్లు తమ బిడ్డ మీడియా కంటపడకుండా కోహ్లీ, అనుష్క శర్మ చాలా జాగ్రత్త పడ్డారు మొన్ననే ఫస్ట్ బర్త్‌డే చేసుకున్న వామిక సడన్‌గా టీవీలో కనిపించడంతో ఆ వీడియోలు, స్క్రీన్ షాట్స్ నెట్‌లో వైరల్ అయ్యాయి. అచ్చం చిన్నప్పటి కోహ్లీ లెక్కనే ఉన్న వామికను చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. మరికొందరూ మాత్రం కోహ్లీ-అనుష్క వద్దనుకున్నా వాళ్ల బిడ్డను టీవీలో చూపించిన బ్రాడ్‌కాస్టర్‌ను తిడుతున్నారు.

వివాదంలో విరాట్‌..

వామికా వ్యవహారాన్ని పక్కనబెడితే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ చేసిన ఓ పని అతన్ని వివాదంలో చిక్కుకునేలా చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో విరాట్ చూయింగ్‌ గమ్‌ నమలడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే జాతీయగీతాన్ని లైట్ తీసుకుంటే ఈ జనరేషన్ ఎలా అర్థం చేసుకుంటుందని, ఇంత బాధ్యతారాహిత్యమా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ పరువు పోయింది..

భారత్ పరువు పోయింది..

రెండో వన్డేతో సిరీస్‌ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ డికాక్‌ ( 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 124) సెంచరీ సాధించాడు. డసెన్‌ (59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది.

దీపక్ చాహర్ పోరాడినా..

దీపక్ చాహర్ పోరాడినా..

విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 5 ఫోర్లతో 65), శిఖర్ ధావన్(73 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లీ అవుట్‌ కావడంతోనే క్లీన్‌స్వీప్‌ ఖాయమైనప్పటికీ... దీపక్‌ చహర్‌ (34 బంతుల్లో 5 బౌండరీలతో 2 సిక్స్‌లతో 54) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్‌ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్‌ తొలి బంతికి చహర్‌ను ఎన్‌గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు.

Story first published: Monday, January 24, 2022, 16:43 [IST]
Other articles published on Jan 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+