వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 24 గంటల వ్యవవధిలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్లు బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది.
ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. కోహ్లీ, రోహిత్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కోహ్లీ, రోహిత్లతో సెల్ఫీలు దిగడంతో పాటు ఆటోగ్రాఫ్స్ కోసం పోటీ పడ్డారు. ఈ వెటరన్ ఆటగాళ్లు కూడా ఓపికగా అభిమానులకు సెల్ఫీలతో పాటు ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు.
ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2025 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ మూడు వన్డే మ్యాచ్ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(కీపర్), వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
తొలి టీ20: అక్టోబర్ 29(బుధవారం),కాన్బెర్రా, మధ్యాహ్నం 1.45 గంటలకు
రెండో టీ20: అక్టోబర్ 31(శుక్రవారం), మెల్బోర్న్, మధ్యాహ్నం 1.45 గంటలకు
మూడో టీ20: నవంబర్ 2(ఆదివారం), హోబర్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు
నాలుగో టీ20: నవంబర్ 6(గురువారం), గోల్డ్ కోస్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు
ఐదో టీ20: నవంబర్ 8(శనివారం), బ్రిస్బేన్, మధ్యాహ్నం 1.45 గంటలకు