|
రోహిత్నే తీసేస్తారా?
తొడ కండరాల గాయంతో ఈ టూర్లోని పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మ ఎంపిక కానీ విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఫిట్గా లేకపోవడం ఏందని, ముమ్మాటికీ ఇది కోహ్లీ కుట్రేనని టీమ్ సెలెక్షన్ సమయంలో హిట్ మ్యాన్ అభిమానులు ఆరోపించారు. తాజాగా భారత్ దారుణంగా ఓటమిపాలవడంతో రోహిత్ లేకుంటే ఇలానే ఉంటుందని, మంచిగైందని కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ లేకుండా భారత్ ఓడిన మ్యాచ్ల వివరాలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తున్నారు.
|
కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకో..
ఆస్ట్రేలియా పర్యటన ముంగిట రోహిత్ శర్మకి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని.. విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకే కెప్టెన్గా పరిమితం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. తాజా ఓటములతో ఆ డిమాండ్కి మరింత సపోర్ట్ లభిస్తుంది. పైగా రెండు మ్యాచ్ల్లో కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలు కూడా జట్టు ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా మైదానంలో విరాట్ తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసి కొట్టాయి. దాంతో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
|
రవిశాస్త్రి ఏం చేస్తున్నావ్..?
రవిశాస్త్రి కోచింగ్ సామర్థ్యంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గడ్డపై అతని పర్యవేక్షణలో టీమిండియా చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించలేకపోతున్న తీరుని నెటిజన్లు ఎండగడుతున్నారు. మూడు వన్డేల సిరీస్ని ఇప్పటికే 0-2తో ఆస్ట్రేలియాకి చేజార్చుకున్న భారత్ జట్టు.. నామమాత్రమైన మూడో వన్డేని కాన్బెర్రా వేదికగా బుధవారం ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్లను ఆడనున్న నేపథ్యంలో.. టీమిండియా పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
|
ఆసీస్ ఆటగాళ్ల తొండి..
ఐపీఎల్ 2020 సీజన్లో దారుణంగా విఫలమైన ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్వెల్ తాజా సిరీస్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నారు. దాంతో ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అభిమానులు విస్మయానికి గురిచేస్తున్నారు. ఇది తొండాట అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డ ఈ ముగ్గురు ఇప్పుడేమో భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారని, ఇది పక్కా స్కామ్ అంటూ ఫన్నీమీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.