
మూడేళ్ల కాలంలో..
వినోద్ రాయ్ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్ కమిటి అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్ రాయ్ సహా రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ బోర్డు వ్యవహారాలను చూసుకుంది. అయితే ఈ మూడేళ్ల కాలంలో బీసీసీఐలో జరిగిన లోటు పాట్లతో పాటు మహిళా క్రికెటర్లపై చూపిన వివక్ష గురించి వినోద్ రాయ్ ..''నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మన్'' అనే పుస్తకంలో ప్రస్తావించారు.

వాడేసిన జెర్సీలు..
'బీసీసీఐ మహిళా క్రికెట్కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపించింది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. ఎంతలా అంటే వారికి కనీసం కొత్త జెర్సీలు కూడా ఇచ్చేవారు కాదు. వారి మ్యాచ్ల సంఖ్య తక్కువని పురుషుల వాడిన జెర్సీలనే కట్ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చేవారు. అయితే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది.

బ్రేక్ఫాస్ట్ సమోస..
ఆయన మహిళల, పురుషుల క్రికెట్ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరింది. ఆ ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్కౌర్కు మ్యాచ్కు ముందు సరైన ఫుడ్ ఇవ్వలేదంటే నమ్ముతారా.

పరుగెత్తలేక సిక్స్లు..
ఆ విషయం హర్మన్ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ తర్వాత హర్మన్తో ఫోన్లో మాట్లాడా.''సార్.. పరుగెత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్లతోనే ఇన్నింగ్స్ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్ లేకపోవడమే. మ్యాచ్ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒక్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరిగ్గా పట్టించుకోలేదని.

మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలి..
ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్, కోచింగ్ అవసరాలు, ట్రావెల్ ఖర్చులు, క్రికెట్ కిట్లు అందించడంతో పాటు మ్యాచ్ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే భారత క్రికెట్కే మంచిదనే నా అభిప్రాయం' అంటూ వినోద్ రాయ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












