రాంచీ: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్, మహరాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టెయిలండర్ సూపర్ బ్యాటింగ్తో మహరాష్ట్ర విజయాన్నందుకుంది. మహరాష్ట్ర విజయానికి చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉండటంతో బెంగాల్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ మహారాష్ట్ర టెయిలండర్ రాజవర్థన్ హంగార్గేకర్ సిక్స్ బాది అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు.
Rajvardhan Hangargekar has smashed a match winning six in the very last ball!#IPL #CSK #RajvardhanHangargekar #IndianCricket #ViratKohli #MSDhoni #RohitSharma #Cricket pic.twitter.com/7BkO6uBfu4
— ScoresNow (@scoresnow_in) November 15, 2022
దాంతో మహారాష్ట్ర ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను బెంగాల్ చేజార్చుకుంది. గ్రూప్-ఈలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సుదిప్ కుమార్(132 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 127) సెంచరీ చేయగా.. షెహ్బాజ్ అహ్మద్(64 బంతుల్లో ఫోర్, 3 సిక్స్తో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతోరాణించాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి, రాజవర్ధన్ హంగార్గేకర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మనోజ్, సత్యజీత్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆ జట్టులో అంకిత్ బావ్నే(97 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 106) సెంచరీతో రాణించగా.. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(42 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40), కేదార్ జాదవ్(55 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 42) పర్వాలేదనిపించారు. అయితే చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన స్థితిలో రాజవర్ధనే(6 బంతుల్లో సిక్సర్తో 9 నాటౌట్) సిక్సర్తో చిరస్మరణీ విజయాన్నందించాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం క్రికెట్లో చాలా గొప్ప విషయమని నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
Rajvardhan Hangargekar finishes off with a six when Maharashtra needed 4 off the last ball. We're here to take over. pic.twitter.com/CK99IXD5sD
— Heisenberg ☢ (@internetumpire) November 15, 2022