
ఫిట్నెస్ టెస్టులో వరుణ్ ఫెయిల్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 12 నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం 19 మందితో కూడిన భారత్ జట్టుని ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. అందులో చోటు దక్కించుకున్న వరుణ్ చక్రవర్తి తాజాగా ఫిట్నెస్ టెస్టులో ఫెయిలైనట్లు తెలుస్తోంది. దాంతో అతడిపై వేటు పడే అవకాశం ఉంది. వరుణ్ ఇప్పటి వరకూ భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

యో-యో ఫిట్నెస్ టెస్టు తప్పనిసరి
టీమిండియా క్రికెటర్ ఎవరైనా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే యో-యో ఫిట్నెస్ టెస్టు పాసవడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ కొత్త ఫిట్నెస్ రూల్ ప్రకారం భారత ఆటగాళ్లు 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి లేదా యో-యో పరీక్షలో 17.1 స్కోరు చేయాలి. ప్లేయర్స్ 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలని బీసీసీఐ తాజాగా రూల్ పెట్టిన విషయం తెలిసిందే. యో-యో టెస్ట్ ద్వారానే గతంలో యువరాజ్ సింగ్, అంబటి రాయుడు కూడా జట్టులో చోటు కోల్పోయారు.

భుజం గాయంతో
ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున 13 మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రతి మ్యాచులో కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియాతో గత ఏడాది చివరలో జరిగిన టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే టూర్కి ముందే భుజం గాయంతో దూరమయ్యాడు. తాజాగా మరోసారి టీమ్లోకి ఎంపికై.. సిరీస్కి ముందే అతను జట్టు నుంచి వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

టీ20 జట్టు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.
తన్మయ్, తిలక్ సెంచరీలు.. అయినా హైదరాబాద్కు నిరాశే! ఆంధ్ర అదరహో!


Click it and Unblock the Notifications












