For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U19 Asia Cup 2024: 13 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. ఫైనల్ చేరిన భారత్!

అండర్ 19 ఆసియా కప్ 2024 టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ చేరింది. శ్రీలంక అండర్ 19 జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత అండర్ 19 జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా యువ సెన్సేషన్, 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(36 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలోలాక్విన్ అబే సింఘే(110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. శారుజన్ షణ్ముగనాథన్(78 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ(3/34) మూడు వికెట్లు తీయగా.. కిరణ్, ఆయుష్ మాత్రే రెండేసి వికెట్లు పడగొట్టారు. యుధజిత్ గుహ, హార్దిక్ రాజ్‌కు చెరో వికెట్ దక్కింది.

Vaibhav Suryavanshi Powers India to U19 Asia Cup 2024 Final After Win Over Sri Lanka

అనంతరం భారత అండర్ 19 జట్టు 21.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 175 పరుగులు చేసి 170 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే(28 బంతుల్లో 7 ఫోర్లతో 34) రాణించాడు. కెప్టెన్ మహమ్మద్ అమాన్(26 బంతుల్లో 2 ఫోర్లతో 25 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. శ్రీలంక బౌలర్లలో విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ తీసారు.

13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి 5 సిక్సర్లతో అలరించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగే చేసిన ఈ చోటా సూరీడు.. జపాన్‌తో 23 పరుగులకే వెనుదిరిగాడు. యూఏఈతో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం తన అసలు సిసలు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.

శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అదే జోరు కనబర్చాడు. రాజస్థాన్ రాయల్స్‌ ఈ చోటా సూరీడుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాడిగా ఈ బీహార్ కుర్రాడు రికార్డ్ సాధించాడు. అంతేకాకుండా అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్నవయస్కుడిగా కూడా నిలిచాడు. డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌ జట్టుతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Friday, December 6, 2024, 16:27 [IST]
Other articles published on Dec 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+