For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs CSK: చావో రేవో మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదం.. కేఎల్ రాహుల్ నిరసన!

 Umpiring controversy mars KXIP vs CSK IPL 2020 crunch game

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. వరుసగా ఐదు విజయాలతో ఆశలు రెకెత్తించిన రాహుల్ సేన బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో ఇంటిబాట పట్టింది. ఆదివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్లతో చిత్తయింది. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది.

ఇంతకేం జరిగిందంటే..

ఇంతకేం జరిగిందంటే..

చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా రవిబిష్ణోయ్ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడగా.. మన్‌దీప్ సింగ్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. ఈ క్యాచ్ కొంచెం సందేహంగా ఉండటంతో అంపైర్లు.. సాఫ్ట్ సిగ్నల్ ఔట్‌గా ఇస్తూ.. థర్డ్ అంపైర్‌ సమీక్షకు వెళ్లారు. దాంతో టీవీ రిప్లేలో పలుమార్లు పరిశీలించిన థర్ట్ అంపైర్ చివరకు నాటౌట్ ఇచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై క్లారిటీ లేకపోవడంతో వివాదాస్పదమైంది. బంతి నేలకు తాకినట్లుగా ఉందని భావించిన థర్డ్ అంపైర్.. బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇచ్చాడు.

రాహుల్, కుంబ్లే అసంతృప్తి..

కానీ ఈ నిర్ణయంపై పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే కూడా అసంతృప్తికి గురైనట్లు టీవీ రిప్లేలో కనిపించింది. డగౌట్ తమ టీమ్ వీడియో అనలిస్ట్‌తో పలుమార్లు ఈ వీడియోను చూసిన కుంబ్లే.. బంతి చేతుల్లోనే ఉందని అతనికి చెబుతున్నట్లు అనిపించింది. అయితే ఈ నిర్ణయంపై కామెంటేటర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు.

 చేతులను చూపిస్తూ రాహుల్ నిరసన..

చేతులను చూపిస్తూ రాహుల్ నిరసన..

ఇక జోర్డాన్ వేసిన 10వ ఓవర్‌లో డూప్లెసిస్(48) కీపర్ రాహుల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఈ క్యాచ్ అందుకున్న కేఎల్ రాహుల్ తన రెండు చేతులను చూపిస్తూ అంపైర్ల తీరుపై నిరస వ్యక్తం చేశాడు. ఈ ఫొటోను కింగ్స్ పంజాబ్ కూడా 'క్లీన్ క్యాచ్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సరైన నిర్ణయం అంటే.. మరికొందరూ అంపైర్ తప్పిదమని కామెంట్ చేస్తున్నారు.

తేలిపోయిన పంజాబ్ బౌలర్లు..

తేలిపోయిన పంజాబ్ బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. దీపక్ హుడా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 62 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. పంజాబ్ బౌలర్లలో జోర్డాన్‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Sunday, November 1, 2020, 20:31 [IST]
Other articles published on Nov 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+