U19 World Cup: చెలరేగిన భారత కుర్రాళ్లు.. బంగ్లాదేశ్కు టఫ్ టార్గెట్!
అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత కుర్రాళ్లు చెలరేగారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(96 బంతుల్లో 6 ఫోర్లతో 76), కెప్టెన్ ఉదయ్ శరణ్(94 బంతుల్లో 4 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.
తెలంగాణ బిడ్డ అరవెల్లి అవినాష్(17 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23) మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫ్ మ్రిధా(5/43) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఎండీ రిజ్వాన్, రెహ్మాన్ రాబీ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యంగ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(7) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే క్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్ సైతం అదే తరహాలో ఔటయ్యాడు.
దాంతో భారత్ తొలి పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులే చేసింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఉదయ్ శరణ్తో కలిసి ఆదర్శ్ సింగ్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో ఆదర్శ్ సింగ్, ఉదయ్ శరణ్ 67 బంతుల్లోనే అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఎండీ రిజ్వాన్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగిన ఆదర్శ్ సింగ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే ఉదయ్ శరణ్ కూడా ఔటవ్వగా.. ప్రియాన్షు మోలియాతో అరవెల్లి అవినాష్ ధాటిగా ఆడాడు. దూకుడుగా ఆడుతున్న అతన్ని మరుఫ్ మ్రిధా ఔట్ చేయగా.. సచిన్ ధాస్(26 నాటౌట్) ధాటిగా ఆడిన భారత స్కోర్ను 251 ధాటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications