సీనియర్ టీమ్లో ఆడటమే టార్గెట్..
సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని గొంగడి త్రిష స్పష్టం చేసింది. ఓ చానెల్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో సత్తా చాటడం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలవడం అంతా కలలా అనిపిస్తోందని తెలిపింది.
తన తండ్రి ప్రోత్సాహంతోనే క్రీడల్లోకి ప్రవేశించానని చెప్పిన త్రిష.. అండర్19 ప్రపంచకప్ విజయాల్లో తన పాత్ర పోషించడం గర్వంగా ఉందని చెప్పింది.

ఆ ఆనందం మాటల్లో చెప్పలేను..
'అండర్-19 టీ20 ప్రపంచక్పలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. కచ్చితంగా టోర్నీ ద్వారా నేనేంటో నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అనుకున్నట్లే జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్లో అర్ధ సెంచరీ (57)తో చేశా. ఇది నాకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్. నా ప్రదర్శనపై కెప్టెన్తో పాటు కోచ్ సహా టీమ్ మేనేజ్మెంట్ సంతృప్తి వ్యక్తం చేశారు.

బౌండరీలతో ఒత్తిడి తగ్గించుకున్నా..
టోర్నీ ఆరంభం నుంచే మా ప్రదర్శనపై జట్టు సభ్యులమంతా పూర్తి ఆత్మవిశాస్వంతోనే ఉన్నాం. అయితే, ఇంగ్లండ్తో తుదిపోరులో నేను కొంచెం టెన్షన్గా ఫీలయ్యా. ఎందుకంటే ఆ పోరులో జట్టు స్వల్ప లక్ష్యఛేదనలో నేను క్రీజులోకొచ్చేసరికే రెండు వికెట్లు పడ్డాయి. దీంతో కాస్త ఒత్తిడిగానే మైదానంలోకి అడుగుపెట్టా, వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఊపిరి పీల్చుకున్నా. ఆపై మరో బౌండరీ బాది 26 పరుగులు చేశా. ఆ వెంటనే ఔటైనా అప్పటికే విజయంపై నమ్మకం కలగడంతో ఆందోళనకు గురవలేదు.

డబ్ల్యూపీఎల్పై ఆశలు
జాతీయ జట్టులో చోటుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చక్కటి వేదిక. మహిళల ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఎంపికవుతానని అనుకుంటున్నా. అక్కడ అదరగొడితే, కచ్చితంగా సీనియర్ జట్టుకు పిలుపు వస్తుంది. సచిన్ టెండూల్కర్ నుంచి ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేనిది. జట్టు మొత్తం సంతోషంగా ఫీలైంది. స్టేజ్పైన మా అందరి గురించి సచిన్ సార్ పొగిడారు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు.'అని త్రిష చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications
