
రంజీ టీమ్లో కూడా లేడు..
కానీ ఇప్పుడు కరుణ్ నాయర్ రంజీ టీమ్లో కూడా చోటు కోల్పోయాడు. స్టార్ ప్లేయర్ అవ్వడం దేవుడెరుగు.. దేశవాళీ క్రికెట్లో కూడా కొనసాగలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ చేసిన భావోద్వేగ పూరిత ట్వీట్ క్రికెట్ అభిమానుల కదలించింది. 'డియర్ క్రికెట్.. నాకు మరొక చాన్స్ ఇవ్వు'అంటూ చేసిన చేసిన ట్వీట్ అతని పరిస్థితి అద్దం పడుతుంది. క్రికెట్ను మతంలా ఆరాధించే భారత్లో క్రికెటర్గా కొనసాగించడం ఆశమాషి వ్యవహారం కాదనే విషయాన్ని తెలియజేస్తోంది. ఒక్క ట్రిపుల్ సెంచరీతో స్టార్ ప్లేయర్ అయిపోదామంటే కుదుదరని, నిలకడగా రాణిస్తేనే ఆ హోదా దక్కుతుందనే విషయం బోధపడుతోంది.

నా జీవితాంతం వెంటాడే..
అయితే కరుణ్ నాయర్ వైఫల్యం వెనుక టీమిండియా సెలెక్టర్లు తీరు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ అంటే ఆశమాషి వ్యవహారం కాదు. కానీ టీమిండియా సెలెక్టర్లు కరుణ్ నాయర్కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. అప్పడు చీఫ్ సెలెక్టర్గా ఉన్న తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అంగీకరించాడు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా తన పదవి కాలంలో కరుణ్ నాయర్కు న్యాయం చేయలేకపోవడం తనను అత్యంతగా బాధపెట్టే అంశమని చెప్పుకొచ్చాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్కు మూడంటే మూడే టెస్ట్ మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చి పక్కనపెట్టేసారు. 2017లో ఆస్ట్రేలియాతో విఫలమవడంతో వేటు వేసారు.

దేశవాళీలో కూడా చోటు లేకపోవడంతో..
అయితే తనను ఎందుకు తప్పించారనే విషయంపై టీమ్మేనేజ్మెంట్ వివరణ ఇవ్వలేదని కరుణ్ నాయర్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం రాకపోయినా.. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు కొనసాగాడు. కానీ కొంత కాలం తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోపీ వంటి రాష్ట్ర స్థాయి జట్టుల్లో కూడా కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ అభిమానులను కదిలించింది. 'సోదరా.. నీ త్రిశతకాన్ని మేమింకా మర్చిపోలేదు. నువ్వు కచ్చితంగా మళ్లీ నిరూపించుకుంటావు'అని కామెంట్ చేస్తున్నారు.
ఇషాన్ కిషన్కు హెచ్చరిక..
అయితే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదిన నేపథ్యంలో కరుణ్ నాయర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇషాన్ కిషన్ను పరోక్షంగా హెచ్చరించేందుకే కరుణ్ నాయర్ ఈ ట్వీట్ చేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తనలా కెరీర్ పాడు చేసుకోవద్దని, ప్రణాళికలతో ముందుకు సాగాలని పరోక్షంగా సూచించాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్తో మూడో వన్డేలో అవకాశం అందుకున్న ఇషాన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












