న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. దేశ ప్రజలకు స్పెషల్ రిక్వెస్ట్!

Team India skipper Virat Kohli Takes First Dose of Covid-19 Vaccine
Virat Kohli Gets COVID-19 Shot | Oneindia Telugu

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఫొటోను విరాట్.. తన ఇన్‌స్టా స్టోరీలో అభిమానులతో పంచుకున్నాడు. వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ముంబైలోని తన ఇంటికి చేరిన విరాట్.. తన సతీమణి అనుష్క శర్మ, కూతురుతో ఈ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.

రెండు రోజుల క్రితం బీసీసీఐ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ డోస్ తీసుకునే సమయానికి ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌లో ఉంటారని, కోవాగ్జిన్ తీసుకుంటే అక్కడ అది దొరకదని, అప్పుడు వ్యాక్సిన్ తీసుకొని ఫలితం ఉండదని పేర్కొంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు కోహ్లీ కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకున్నారు.

కరోనా పోరులో భాగంగా విరాట్ కోహ్లీ, తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపైన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముందుగా ఈ జోడీ తమ వంతుగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది. క్వెట్టా సంస్థతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ నిర్వహిస్తుంది. ఇక ఫస్ట్ వేవ్ సమయంలో పీఎంకేర్స్‌కు రూ.3 కోట్ల విరాళాన్ని అందజేసింది.

Story first published: Monday, May 10, 2021, 13:27 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X