
నలుగురిపై వేటు..
ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ 11, 14, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఇక నిలకడకు మారుపేరైన సూర్యకుమార్ యాదవ్ సైతం 3, 5, 8 తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను కాదని జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్ చాహర్ కూడా విఫలయ్యాడు. మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మూడు పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ కూడా చేయలేదు.

భువీ సైతం..
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ అయిన భువనేశ్వర్ కుమార్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో కట్టడి చేయలేకపోతున్నాడు. దీంతో ఈ ఐదుగరు ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫామ్లో లేని వీరిని తప్పించి ఐపీఎల్లో రాణిస్తున్న శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

ఆడకపోతే అంతే..?
టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకు ఐసీసీ గడువు విధించడంతో ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన అనంతరం జట్టులో మార్పులు చేసేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తుందని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఐదుగురి ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. మరో 12 రోజుల సమయం ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. ఒకవేళ విఫలమైతే మాత్రం వీరిపై వేటు వేసేందుకు బీసీసీఐ వెనుకడుగు వేయదన్నాడు.
'కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలకడలేమి ఫామ్తో సతమతమయ్యాడు. కానీ ఈ సీజన్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది మంచి టచ్లోకి వచ్చాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరూ భారత జట్టు తరఫున రాణించారు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ ఐపీఎల్లో రాహుల్ చాహర్ మెరిసాడు. భువనేశ్వర్ కుమార్ అనుభవం కలిగిన బౌలర్. ఇంకా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి వీరు ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్క హార్దిక్ పాండ్యా వ్యవహారమే బీసీసీఐకి తలనొప్పిగా మారింది. అయితే వీరు ఫామ్ అందుకోకపోతే మాత్రం వీరిపై వేటు పడటం ఖాయం. వీరి స్థానాల్లో ఇతర ఆటగాళ్లకు చోటు దక్కుతుంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

పాక్తో తొలి పోరు..
ఇక అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. అక్టోబర్ 23న అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.


Click it and Unblock the Notifications












