ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకుంది. పాకిస్థాన్తో గత ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది.
అయితే సూపర్-8లో టీమిండియా తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. ఈ టోర్నీకి ముందు ఐసీసీ సూపర్-8 గ్రూప్స్ సీడింగ్ తీసింది. గ్రూప్ దశలో తలపడిన జట్లు మరోసారి సూపర్-8లో తలపడకుండా ఈ సీడింగ్ తీసారు.
భారత్తో పాటు ఇప్పటికే సూపర్-8 సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూప్లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు అయితే సూపర్-8 చేరుతుందో ఆ జట్టుకే భారత్ గ్రూప్లో చోటు దక్కనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా అర్హత సాధిస్తే ఈ గ్రూప్ మరింత టఫ్గా మారనుంది.

సూపర్-8లో భారత్ మూడు మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 26న జింబాబ్వే, ఆస్ట్రేలియాలో ఒక జట్టుతో తలపడుతుంది. మార్చి 1న వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకునే అవకాశం ఉంది. లీగ్ ఫార్మాట్ పూర్తయిన తర్వాత సూపర్-8 గ్రూప్స్పై మరింత స్పష్టత రానుంది.
ఫిబ్రవరి 22: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా(అహ్మదాబాద్, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 26: భారత్ వర్సెస్ జింబాబ్వే/ఆస్ట్రేలియా(చెన్నై), రాత్రి 7 గంటలకు)
మార్చి 1: భారత్ వర్సెస్ వెస్టిండీస్(కోల్కతా, రాత్రి 7 గంటలకు)
ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతీ గ్రూప్లో ఉన్న ఐదు జట్లు లీగ్ దశలో తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. అంటే ఒక్కో జట్టు నాలుగేసి లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఈ 4 మ్యాచ్లు ముగిసే సరికి ప్రతీ గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
ఈ 8 జట్లను మళ్లీ రెండు గ్రూప్స్గా విభజిస్తారు. ఇక్కడ మళ్లీ ప్రతీ జట్టు తమ గ్రూప్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. అంటే ప్రతీ టీమ్ మూడేసి మ్యాచ్లు ఆడుతుంది. ఈ మూడు మ్యాచ్ల అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు రెండు గ్రూప్స్ నుంచి సెమీస్ చేరుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.