టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో బుధవారం జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో ఆరో ఓవర్లో బంతిని అందుకున్న జస్ప్రీత్ బుమ్రా లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడి చేశాడు. టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రాకు ఇది 11వ మెయిడిన్ ఓవర్. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ రికార్డును బుమ్రా అధిగమించాడు. బుమ్రా 63 మ్యాచ్ల్లో 11 ఓవర్లు మెయిడిన్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేసాడు.

ఈ జాబితాలో పసికూన టీమ్స్ ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో టాప్లో ఉండగా.. కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో బుమ్రా కన్నా ముందున్నారు. ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్లో జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్గా మాత్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు.
అనంతరం లక్ష్యచేధనకు టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) సత్తా చాటాడు.
విరాట్ కోహ్లీ(1), సూర్యకుమార్ యాదవ్(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ తలో వికెట్ తీసారు.