
సూర్యతో బ్యాటింగ్ ఆస్వాదిస్తా..
ఈ బిగ్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ ఇంటర్వ్యూను విడుదల చేసింది. ఈ వీడియో విరాట్.. సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'సూర్యతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపిస్తుంది. అరుదైన నైపుణ్యం, సామర్థ్యంతో అతడు అలరిస్తాడు. క్రీజులోకి రాగానే బంతి వికెట్ల మీదకు ఎలా వస్తుందని అడుగుతాడు. ఆ తర్వాత 2-3 బంతులు ఆడి పిచ్పై ఓ అంచనాకు వస్తాడు. ఆ తర్వాత బాదుడు మొదలుపెడతాడు. మేమిద్దరం ఎప్పుడు భాగస్వామ్యం నెలకొల్పినా, ఎదురుదాడి తానే చేస్తానని అంటాడు.

అండగా ఉండన్నా అంటాడు
..
నువ్వు అండగా ఉంటే చాలని చెప్తాడు. అందుకే సూర్య క్రీజులో ఉన్నప్పుడు నా పాత్ర భిన్నంగా ఉంటుంది. అతనితో బ్యాటింగ్ను నేను ఆస్వాదిస్తాను కూడా.జట్టుకు మంచే జరుగుతుంది'' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తాజాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో కోహ్లీ-సూర్య మెరుపు భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన సిరీస్ నిర్ణాయక టీ20లో ఈ జోడీ కేవలం 10.2 ఓవర్లలోనే 104 పరుగులు రాబట్టింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లోనూ సూర్య-విరాట్ జోడీ రాణించడం భారత్కు కీలకం.

ధోనీ మద్దతుకు రుణపడి ఉన్నా..
కెరీర్ ఆరంభంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన మద్దతు మరవలేనిదని, అతని ప్రోత్సహం కారణంగానే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని విరాట్ తెలిపాడు. ఎప్పటికీ తాను ధోనీకి రుణపడి ఉంటానని చెప్పాడు. 'ధోనీతో ఉన్న స్నేహం, బంధం గురించి వివరించడం చాలా కష్టం. ఎందుకంటే అతను నన్ను అర్ధం చేసుకున్న విధానం, నాపై ఉంచిన నమ్మకం అలాంటిది. మేం ఇద్దరం బ్యాటింగ్ చేసేటప్పుడు ఒకరికొకరం చెప్పుకోకుండా పరుగులు తీసేవాళ్లం. 10-12 ఏళ్లు మేం ఇద్దరం కలిసి ఆడగా ఒకటి, రెండుసార్లు మా మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయే కానీ.. ఎప్పూడూ ఇద్దరం గేమ్పై ఫోకస్గా ఉండేవాళ్లం. అదే నమ్మకం, విశ్వాసం, స్నేహం మైదానం బయట కూడా కొనసాగుతోంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
