
ధోనీ ఒక్కడే..
టీ20 ప్రపంచకప్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించాడు. క్రికెట్ చరిత్రలోనే విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక టోర్నీ ఆసాంతం అదే జోరును కనబరుస్తున్న అతను అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అయితే తాను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు అండగా నిలిచిన వారు ఎవరూ లేరని, ఒక్క ధోనీ మాత్రం తనకు ధైర్యం చెప్పాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాజాగా విడుదల చేసిన పోడ్కాస్ట్లో కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ధోనీతో స్నేహం.. ఓ దీవేన..
తాను ఫామ్ లో లేని సమయంలో ధోనీ నుంచి వచ్చిన మెసేజ్ ఎంతో విలువైనదని వివరించాడు. ధోనీ వంటి సీనియర్ ఆటగాడితో పరస్పర గౌరవంతో కూడిన స్నేహ బంధం కలిగివుండటం ఓ దీవెనగా భావిస్తానని పేర్కొన్నాడు. 'ధోనీ పంపిన సందేశంలో ఓ అంశం నన్ను బలంగా తాకింది. నువ్వు ఆత్మవిశ్వాసంతో నిలబడినప్పుడు, దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు... నువ్వు ఎలా ఆడుతున్నావు అన్న విషయాన్ని అడగడం ప్రజలు మర్చిపోతారని ధోనీ పేర్కొన్నాడు.

ఆ విషయం అర్థమైంది..
నా పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతుందనిపించింది. ప్రజలు నన్నెప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కూడిన వ్యక్తిగా, మానసికంగా బలమైన వ్యక్తిలా, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగిన వ్యక్తిలా చూసేవారు. అయితే, జీవితంలోని కొన్ని సమయాల్లో రెండడుగులు వెనక్కి వేసి మనల్ని మనం సమీక్షించుకోవాలన్న విషయం అర్థం చేసుకున్నాను'అని వివరించాడు.


Click it and Unblock the Notifications
