For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: టీమిండియాను ఆదుకున్న సూర్య.. సఫారీ ముందు ఫైటింగ్ టార్గెట్!

T20 World Cup 2022: South Africa chasing 134 after Suryakumar’s brilliant 68 helps India post 133/9

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. సఫారీ సూపర్ బౌలింగ్‌ను ఆడలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దినేశ్ కార్తీక్ సాయంతో 6వ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. సూర్య సూపర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకు అండగా మరో బ్యాటర్ రాణించకపోవడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29), పార్నెల్(3/15) భారత్ పతనాన్ని శాసించారు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.

ఓపెనర్ల వైఫల్యం..

ఓపెనర్ల వైఫల్యం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(9) ఓకే ఓవర్లో వెనుదిరిగారు. మూడు బంతుల వ్యవధిలోనే ఈ ఇద్దరు ఔటయ్యారు. లుంగి ఎంగిడి‌తో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రచించిన వ్యూహంలో చిక్కుకున్నారు. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో రెండో బంతికి రోహిత్ శర్మ(15) రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. చివరి బంతికి రాహుల్(9) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగారు. రోహిత్ శర్మను బలహీనతను టార్గెట్ చేస్తూ లుంగి ఎంగిడి షార్ట్ బాల్‌తో రోహిత్‌ను టెంప్ట్ చేయగా.. మిస్ టైమ్ అయిన బంతి అక్కడే గాల్లోకి లేచింది. దాంతో ఎంగిడి సునాయస క్యాచ్ అందుకొని రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

సఫారీ ఉచ్చులో భారత బ్యాటర్లు..

సఫారీ ఉచ్చులో భారత బ్యాటర్లు..

ఆ తర్వాత ఫుట్‌వర్క్ లోపంతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌ను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌తో లుంగి ఎంగిడి బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని రాహుల్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ మార్కర్‌మ్ చేతిలో పడింది. వ్యూహాత్మకంగానే ఎంగిడి స్లిప్ ఫీల్డర్ పెట్టి ఈ బంతిని వేయగా.. రాహుల్ అతని ట్రాప్‌లో పడ్డాడు. క్రీజులోకి సూర్య, కోహ్లీ రాగా.. టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. ఎంగిడి వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లీ(12) వరుస బౌండరీలో జోరుకనబర్చాడు. కానీ అదే ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు.

ఆదుకున్న సూర్య..

ఆదుకున్న సూర్య..

క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. నోర్జ్ వేసిన మరుసటి ఓవర్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ఎంగిడి బౌలింగ్‌లో రబడా సూపర్ క్యాచ్‌కు హార్దిక్ ఔటయ్యాడు. దాంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి సూర్య ఆచితూచి ఆడాడు. ఓవైపు కార్తీక్ నిదానంగా ఆడుతున్నా.. సూర్య మాత్రం ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ప్రతీ ఓవర్‌లో బంతిని బౌండరీకి తరలించాడు. ఎంగిడి వేసిన 15వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

సూర్య ఔటవ్వడంతో..

మరుసటి ఓవర్‌లో కార్తీక్(6) ఔటవ్వడంతో 6వ వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన అశ్విన్(7)తో కలిసి సూర్య స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అశ్విన్ ఔటైనా సూర్య ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతని జోరుకు పార్నెల్ కళ్లెం వేసాడు. దాంతో 19వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో మహమ్మద్ షమీ రనౌటవ్వగా.. భువీ, అర్ష్‌దీప్ 6 పరుగులు చేశారు. దాంతో ఇండియా 130 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది.

Story first published: Sunday, October 30, 2022, 18:25 [IST]
Other articles published on Oct 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+