గత రికార్డులన్నీ బ్రేక్..
ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియాకప్ వేదికగా భారత్ X పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల వ్యూస్తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా భారత్ X పాక్ మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ రాబట్టింది. హాట్స్టార్లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్పీ రేటింగ్స్లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే. భారత్ విజయంతో అభిమానులు ఒకరోజు ముందే దీపావళీ పండుగ చేసుకుంటుండగా.. స్టార్ స్పోర్ట్స్ లాభాలు తెచ్చిపెట్టింది.

విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్..
ఆదివారం.. ప్రపంచకప్ తొలి మ్యాచ్ కావడం.. ఓటమి అంచుల నుంచి భారత్ విజయాన్నందుకోవడం బ్లాక్ బస్టర్ వ్యూస్కు ఒక కారణమైతే.. కింగ్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ మరో కారణం. ఓటమి అంచుల నుంచి భారత్ విజయం వైపు నడవడం అభిమానులను ఒంటికాలిపై నిలబెట్టింది. ఇక ఆఖరి ఓవర్లో మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ భారత్ వశం కావడం.. అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. ఈ పరిస్థితులన్నీ స్టార్ స్పోర్ట్స్కు పంటపండించాయి.

పరుగుల రారాజు విరాట్ కోహ్లీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్)కి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40) రాణించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 113 పరుగులు జోడించారు.


Click it and Unblock the Notifications












