
15 నుంచి 20 శాతం..
అయితే టోర్నమెంట్ నుంచి టీమిండియా నిష్క్రమించడం వల్ల నెట్వర్క్ దాని స్పోర్ట్స్ ఛానెల్ల ఆదాయంలో 15 నుంచి 20 శాతం వరకు కోల్పోయిందని, మీడియా బ్రాడ్కాస్టింగ్ ఎక్స్పర్ట్ మదన్ మోహపాత్ర అంచనా వేశారు. ఒకవేళ భారత్ సెమీ-ఫైనల్ , ఫైనల్ ఆడినట్లయితే, అప్పుడు ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉండేది. బ్రాడ్కాస్టర్లు సాధారణంగా క్రికెట్ టోర్నమెంట్ల కోసం 80-85 శాతం అడ్వర్టైజింగ్ స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. మిగిలిన టోర్నమెంట్ కోసం, మ్యాచ్ వారీగా నిర్ణయం తీసుకుంటారు, తద్వారా వారు మ్యాచ్ ప్రకారం ప్రకటనల రేట్లను పెంచడంపై నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈసారి అది కుదరలేదు.

నిష్క్రమించడంతో..
హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్న భారత్ సెమీస్ చేరతుందని భావించినా స్టార్ ఇండియా భారీ మొత్తంలోనే అడ్వాన్స్లు తీసుకుంది. కొన్ని స్లాట్లను మరింత ఎక్కువ ధరకు అమ్ముకోవాలని భావించింది. కానీ భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వారి ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. అంతేకాకుండా టీమిండియా నిష్క్రమణతో ఈ టోర్నీని చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 50-70 శాతం మంది ప్రేక్షకులను కోల్పోవాల్సి వచ్చింది. ఇది స్టార్ స్పోర్ట్స్ ఆదాయంపై దెబ్బపడింది.

భారత్-పాక్ మ్యాచ్ రికార్డు వ్యూస్..
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు రెండు దేశాల అభిమానులు ఎగబడటంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ట్ స్పోర్ట్స్ పంట పండింది. టీ20 చరిత్రలోనే ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టింది. రికార్డు స్థాయిలో 167 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు 136 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్ బ్రేక్ చేసింది.
ఈ మ్యాచ్ మధ్యలో వచ్చే 10 సెకన్ల యాడ్కు రూ.25 నుంచి 30 లక్షలు వసూలు చేసింది.

సెమీఫైనల్లో కూడా..
ఇదే క్రమంలో భారత్ సెమీఫైనల్ చేరినా.. మరోసారి భారత్-పాక్ ఫైనల్లో తలపడినా వీలైనంత వసూలు చేయాలని భావించింది. కానీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఏక పక్షంగా సాగడం.. స్టార్ ఇండియా కొంపముంచింది. హాట్ స్టార్ వ్యూస్ అయితే దారుణంగా పడిపోయాయి. ఏ దశలోనూ ఈ సంఖ్య 50 లక్షలు ధాటలేదు. అదే భారత్- పాక్కు కోటిన్నర వ్యూస్ వచ్చాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్కు రెండు కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే రికార్డు. ఈసారి కూడా భారత్ సెమీస్ చేరితే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని స్టార్ ఇండియా ఆశపడింది. కానీ ప్రతీకూల ఫలితాలతో భారత్ నిష్క్రమించడంతో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications












