
రోహిత్ కోసం..
'రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్ చూస్తోంది. రోహిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇన్నాళ్లూ ఎలా దూకుడుగా ఆడాడో, ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా ఆడాడు. అతని బ్యాటింగ్లో ఎటు వంటి మార్పు కనిపించడం లేదు. రోహిత్ శర్మ పవర్ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అదే విధంగా అతడికి ఒక సారథిగా జట్టును విజయ పథంలో నడిపించే సత్తా ఉంది" అని సూర్య చెప్పుకొచ్చాడు.

అవసరమైతే బౌలింగ్ చేస్తా..
టీమ్ కోసం అవసరమైతే బౌలింగ్ చేయడానికి కూడా తాను సిద్దంగా ఉన్నానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'జట్టు కోసం అవసరమైతే బౌలింగ్ చేసేందుకు రెడీ. బౌలర్లు నెట్స్లో బ్యాటింగ్ సాధన చేస్తున్నప్పుడు వారికి బౌలింగ్ చేస్తూ మెలుకువలు నేర్చుకుంటున్నాను. దాంతో పాటు మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి ఆఖరి వరకు క్రీజులో ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. జట్టు విజయానికి మరో 20-25 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఔటైతే చాలా బాధగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ అయ్యర్ పూర్తి సానుకూల దృక్పథంతో ఆడతాడు. అతని నుంచి చక్కటి మద్దతు లభించింది. మేమిద్దరం ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాలనుకున్నాం'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

భళా బిష్ణోయ్..
అరంగేట్ర మ్యాచ్లోనే రవి బిష్ణోయ్ అదరగొట్టాడని సూర్య కితాబిచ్చాడు. 'ఫస్ట్ మ్యాచ్లోనే రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన జట్టుపై అరంగేట్రం చేసే గొప్ప అవకాశం అతనికి దక్కింది. ఆరంభంలో కొంచెం తడబడినా.. ఆ తర్వాత పుంజుకున్నాడు. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసి.. విజయవంతమయ్యాడు. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర జట్లలో వెస్టిండీస్ ఒకటి. అందుకే, ఒక్క మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన విండీస్ను తక్కువ అంచనా వేయలేం. సిరీస్ నిర్ణయాత్మక రెండో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటున్నాను'అని సూర్యచెప్పుకొచ్చాడు.

వరుసగా వికెట్లు పడ్డా..
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో టీమిండియా శుభారంభం అందుకుంది. అయితే ఓవర్ల వ్యవధిలోనే రోహిత్, కిషాన్, కోహ్లీ, పంత్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ వెంకటేశ్ అయ్యర్(24)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి 26 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం అందించారు.


Click it and Unblock the Notifications












