'న్యూఢిల్లీ: క్రీడాకారులందరికీ.. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్లలో దాదాపు అందరికీ కూతుళ్లే. ఈ 'ఫాదర్ ఆఫ్ డాటర్'ల లిస్ట్ కాస్త పెద్దదే. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్, సౌరవ్ గంగూలీ, ఇంకొంచెం పాస్ట్లోకి వెళితే కపిల్ దేవ్, మొన్నమొన్నయితే అజింక్యా రహానే, అంబటి రాయుడు.. అంతా కూతురు కూచీలు. తల్లిని కూడా పక్కకు నెట్టేసి ఫొటోలు దిగేస్తారు ఈ తండ్రీ కూతుళ్లు. ముద్దులొలికే తమ చిట్టి తల్లులతో ఆస్వాదించే సమయం కన్నా విలువైంది ఏముండదు? అందుకే ఆ అవకాశం వస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. తమ గారాల పట్టితో ఆడుకొనేందుకే మొగ్గు చూపిస్తారు.
Taking my little girl for a drive! She is so in love with the rains. #DelhiRains pic.twitter.com/dTvhf5XFxT
— Suresh Raina🇮🇳 (@ImRaina) July 22, 2020
టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం ఇందుకు భిన్నమేమీ కాదు. ఢిల్లీలో వర్షం పడగానే ఆ ప్రకృతి పరవశాన్నీ తన కుమార్తె గ్రేసియా రైనాతో కలిసి ఆస్వాదించాడు. కారులో ఆమెను డ్రైవ్కు తీసుకెళ్లాడు. బోరున వర్షం కురుస్తుండగా బ్యాక్గ్రౌండ్లో మంచి సంగీతం వస్తుండగా తనే స్వయంగా కారు నడుపుతూ ఆమెతో కాసేపు గడిపాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నా చిట్టి తల్లిని డ్రైవ్కు తీసుకెళ్లాను! ఆమె వర్షంతో ప్రేమలో పడింది' అని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
ప్రస్తుతం రైనా ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన రైనా రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దానికి ఐపీఎల్ తన ముందున్న ఏకైక మార్గమని భావిస్తున్నాడు. ఇప్పటికే సొంతమైదానంలో పంత్తో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
పఠాన్.. భారత జట్టులో ఆల్రౌండర్లే లేరంటావా: యువరాజ్ సింగ్