
షాట్ సెలెక్షన్ రాంగ్..
బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై విరాట్ కోహ్లీ తడబడ్డాడు. అయితే ఓ చూడచక్కటి కవర్ డ్రైవ్తో క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన విరాట్.. చివరకు 23 పరుగులు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే ఆ బంతిని మిస్ అయినప్పుడే ఔటయ్యానని విరాట్ కోహ్లీ గ్రహించడని దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అసలు విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే ఓ చానెల్తో మాట్లాడిన గవాస్కర్.. విరాట్ షాట్ సెలెక్షన్ను తప్పుబట్టాడు.

అతనికి ఎప్పుడూ ఇబ్బందే
'విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడాల్సింది కాదు. మొహాలీలో జరిగిన తొలి టెస్ట్లో బ్యాక్ఫుట్పై ఆడినట్లుగానే ఈ రోజు కూడా ఆడదామనుకున్నాడు. ఆ బంతిని స్ట్రైయిట్గా ఆడుదామని కోహ్లీ భావించాడు. కానీ బంతి తక్కువ ఎత్తులో వచ్చి బ్యాట్ను తప్పించుకొని ప్యాడ్లను తాకింది. అయితే కోహ్లీ ఆ షాట్ ఆడడానికి ఎప్పుడూ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆ బంతి మిస్ అయ్యిందంటే కచ్చితంగా ఎల్బీగా వెనుదిరిగుతాడు'అని గవాస్కర్ పేర్కొన్నాడు.

పట్టు బిగించిన భారత్..
బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.
అనంతరం జస్ప్రీత్ బుమ్రా (3/15), మహ్మద్ షమీ (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్ (85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications












